Advertisement

  • ఏలూరులో గత 24గంటల్లో వింత వ్యాధి కేసు ఒకటి కూడా నమోదుకాలేదు

ఏలూరులో గత 24గంటల్లో వింత వ్యాధి కేసు ఒకటి కూడా నమోదుకాలేదు

By: chandrasekar Mon, 14 Dec 2020 8:42 PM

ఏలూరులో గత 24గంటల్లో వింత వ్యాధి కేసు ఒకటి కూడా నమోదుకాలేదు


కొద్దిరోజులుగా వింత వ్యాధితో వణికిస్తోంది. ఈ అంతు చిక్కని వ్యాధిపై గత కొన్ని రోజులుగా వైద్యులు, నిపుణులు ఫోకస్ పెట్టారు.. కారణాలను తేల్చే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఏలూరువాసులకు ఊరట లభించింది.

గత 24గంటల్లో ఏలూరులో వింత వ్యాధి కేసు ఒకటి కూడా నమోదుకాలేదు. ప్రస్తుతం ఏలూరు ఆసుపత్రిలో నలుగురు చికిత్స పొందుతున్నారు. విజయవాడ ఆసుపత్రి నుంచి 29 మంది డిశ్చార్జి అయ్యారు. ఆరు మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా కేసులు నమోదు కాలేదు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రాథమికంగా నీళ్లు, ఆహారం వల్ల జనాలు అస్వస్థతకు గురవుతున్నారని నిర్థారించారు. నీళ్లలో పురుగుల మందులు ఏవైనా కలిశాయా అన్న కోణంలోనూ విశ్లేషిస్తున్నారు. ఈ వింత వ్యాధికి కారణాలు ఏంటో పూర్తిస్థాయిలో తేల్చే పనిలో ఉన్నారు. పశ్చిమగోదావర జిల్లో మొత్తం 615 కేసులు నమోదు కాగా, ఏలూరు వింత వ్యాధికి కారణాలకు సంబంధించి త్వరలో నివేదికలు రానున్నాయి. బుధవారం ఎయిమ్స్, సీసీయంబీ, యన్ ఐయన్ , ఐఐసీటీ సంస్థల నుంచి తుది నివేదికలు రానున్నాయి.

Tags :

Advertisement