Advertisement

  • డిసెంబర్ నాలుగున తెరాస మహిళా అభ్యర్థి మేయర్ గా కూర్చుకుంటుంది ...కేటీఆర్

డిసెంబర్ నాలుగున తెరాస మహిళా అభ్యర్థి మేయర్ గా కూర్చుకుంటుంది ...కేటీఆర్

By: Sankar Thu, 19 Nov 2020 7:34 PM

డిసెంబర్ నాలుగున తెరాస మహిళా అభ్యర్థి మేయర్ గా కూర్చుకుంటుంది ...కేటీఆర్


జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పొత్తుల అంశంపై కేటీఆర్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తు లేదని తేల్చి చెప్పారు. గతంలో పాతబస్తీలో ఐదు స్థానాల్లో గెలిచామని, ఈసారి పది గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

తమ విధానాలు బాగుండి, ఎంఐఎం తమకు మద్దతు ఇచ్చిందన్నారు. వాళ్లకు మేయర్ సీటు ఇవ్వడానికి తమకేమైనా పిచ్చా అని కేటీఆర్ ఘాటుగా ప్రశ్నించారు. 100 స్థానాల్లో గెలిస్తే తాము మేయర్ అవుతాం కానీ.. ఎంఐఎంకి ఎందుకిస్తామన్నారు. డిసెంబర్ నాలుగున టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మహిళ మేయర్‌గా కూర్చుంటుందని, తమకు వేరే ఆలోచన లేదని, ఎవరితో తమకు పొత్తు లేదన్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో అనేక అంశాలపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు..గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్.. తామైతే బల్దియాపై గులాబీ జెండా ఎగురవేస్తామని.. గోల్కొండపై కషాయాలు, కాషాయాలు ఉండవని.. గోల్కొండపై కేసీఆర్ జాతీయ జెండాను ఎప్పుడో ఎగరేశారని… ఆ విషయం బండి సంజయ్ కు తెలియనట్టుందని ఎద్దేవా చేశారు

Tags :
|
|
|

Advertisement