ఆస్ట్రేలియా వరకు రండి ..అక్కడినుండి కైలాసకు మేము తీసుకెళ్తాము ..నిత్యానంద
By: Sankar Fri, 18 Dec 2020 6:30 PM
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరో సారి వార్తల్లో నిలిచాడు. ఇప్పటికే ప్రత్యేక దేశం, రిజర్వు బ్యాంక్, కరెన్సీ, జెండా ఏర్పాటు చేసుకున్న నిత్యానంద తాజాగా ఓ ప్రకటన చేశాడు.
‘కైలాస’ని సందర్శించాలని భావిస్తున్న వారికి వీసాలు మంజూరు చేయనున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలో ఇప్పటికే ‘కైలాస’ ద్వీపం పేరు మీదుగా ఓ ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేశాడు. ఇక ‘కైలాస’ను దర్శించాలనుకునేవారు దీని ద్వారా వీసాకు అప్లై చేసుకోవచ్చని తెలిపాడు.
ఈ నేపథ్యంలో కైలాసను సందర్శించాలనుకునే వారి కోసం ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేకంగా ‘గరుడ’ పేరుతో చార్టెడ్ ఫ్లైట్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని తెలిపాడు. అయితే ఇప్పటి వరకు కూడా నిత్యానంద ‘కైలాస’ ఎక్కడ ఉందనే దాని గురించి ఖచ్చితమైన సమాచారం తెలియరాలేదు. దీన్ని బట్టి ‘కైలాస’ ఆస్ట్రేలియా పరిసర ప్రాంతాల్లో ఉంటుందని భావిస్తున్నారు.