Advertisement

  • నిత్యానంద స్వామి సేవలో పరవశిస్తానంటున్న మరో నటి

నిత్యానంద స్వామి సేవలో పరవశిస్తానంటున్న మరో నటి

By: chandrasekar Fri, 28 Aug 2020 8:40 PM

నిత్యానంద స్వామి సేవలో పరవశిస్తానంటున్న మరో నటి


ఇటీవల్ల కాలంలో ఒక కొత్త దేశాన్నే ఏర్పాటుచేసికొని దానిలో కొత్త కరెన్సీని కూడా విడుదల చేసిన వివాదాస్పద స్వామిజీ నిత్యానందంపై మరో నటి మనసు పారేసుకుందని తెలిసింది. ఇది భక్తో లేక ఏంటో తెలియదు కాని స్వామివారి సేవకు నేను కూడా సిద్దం అంటూ ప్రకటించేసింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందతో నటి రంజిత బంధానికి ఏ పేర్లు పెట్టుకున్నా నిత్యానందతో రంజిత రాసలీలలు సాగించిందనే ఆరోపణలు బలంగానే ఉన్నాయి. ఈ విషయంలో తనపై వచ్చిన రూమర్స్‌ని ఆమె కొట్టిపారేసినా నిత్యానందకు సంబంధించిన బిదాడి ఆశ్రమంలో నటి రంజిత ఏడాదికి పైగా ఉందని అప్పుడు స్వామి వారికి కావాల్సిన అన్ని కార్యక్రమాలను సమర్పించిందని నిత్యానందపై పోలీసులు జరిపిన విచారణలో బయటకు వచ్చింది.

రంజితతో మాత్రమే కాకుండా ఇంకా 15 మందికి పైగా మహిళా భక్తులతో రాసలీలలు సాగించినట్టుగా స్వయంగా నిత్యానందే ఒప్పుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తరవాతి కాలంలో నిత్యానందపై చాలా ఆరోపణలు వచ్చాయి. ఆ తరువాత భారత్ నుంచి పరారైన నిత్యానంద ఒక దీవిని కొనుగోలు చేసి దానికి ‘రిపబ్లిక్ ఆఫ్ కైలాస్’ అనే పేరు పెట్టి దాన్ని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతే కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసను కూడా ఏర్పాటు చేసి కరెన్సీని ముద్రిస్తున్నారు. ఇంతకు ముందు జరిగిన తమిళ బిగ్ బాస్ షో నుండి అర్థాంతరంగా బయటకు వచ్చేసిన ఈమె వివాదాలను కేరాఫ్ అడ్రస్ గా మారింది.

నింత్యానంద యొక్క కైలాసాకి కేవలం అతని భక్తులకు మాత్రమే ప్రవేశం ఉండటంతో నేను కూడా స్వామి సేవలో పరవశిస్తా అంటూ పోస్ట్ పెట్టింది తమిళ సంచలన నటి మరియు బిగ్ బాస్ బ్యూటీ మీరా మిథున్. స్వామి వారిపై ప్రేమ కురిపిస్తూ అందరూ కలిసి ఆయనను తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది మిరా మిథున్. నిత్యానంద స్వామి రోజురోజుకు మరింత శక్తిమంతంగా మారుతున్నారని తాను త్వరలోనే నిత్యానంద కైలాస దేశానికి వెళ్లాలని కోరుకుంటున్నట్టు తెలిపిన ఈ భామ ‘లాట్స్ ఆఫ్ లవ్’ అంటూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. చాలామంది అయన రాసిన పుస్తకాలు చదివి మరియు అయన మాట్లాడిన వీడియోలను చూసి అయన యొక్క భక్తికి పరవశం చెందుతున్నారు.

నిత్యానంద స్వామి స్వయంగా రాసిన ‘లవింగ్ ఎన్ లైట్‌మెంట్’ అనే పుస్తకాన్ని చదువుతూ స్వామి వారు పుస్తకంలో కురిపించిన ప్రేమ సూక్తుల్ని పేజీలు తిప్పి మరీ చూపిస్తూ ఆయన ప్రేమకు ముగ్ధురాలినయ్యానంటూ వెంటనే ఆయన్ని కలవాలని ఉందంటూ మనసులో కోరికను బయటపెట్టింది. ఇక ఈ మధ్య కాలంలో మీరా మిథున్ వరుస వివాదాలతో తమిళ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అన్ని ఇండస్ట్రీలను కుదిపేస్తున్న నెపోటిజం పై స్పందించిన ఈమె స్టార్ హీరోయిన్ త్రిషపై సంచలన ఆరోపణలు చేసింది. ఆమె వల్లనే తనకు అవకాశాలు రాకుండా పోయాయని త్రిష తనను తొక్కేయడానికి ప్రయత్నించిందని మీరా ఆరోపణలు గుప్పించింది. ఇక స్టార్ హీరోలు సూర్య, సూర్య, విజయ్ లు నెపోటిజం కారణంగానే ఇంత దూరం వచ్చారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది మీరా మిథున్. నిత్యానంద స్వామి ప్రేమకు ముగ్ధురాలినయ్యానంటూ తమిళ ఇండస్ట్రీకి షేక్.



Tags :

Advertisement