Advertisement

ముంబైకి తప్పిన నిసర్గ ముప్పు

By: Sankar Wed, 03 June 2020 9:46 PM

ముంబైకి తప్పిన నిసర్గ ముప్పు

నిసర్గ తుఫాన్‌తో దేశ వాణిజ్య నగరం ముంబైకి ముప్పు తప్పింది. ముందుగా ఊహించినంతగా పెద్దగా విధ్వంసం జరగలేదు. తీరం దాటిన తర్వాత తుఫాన్ బలహీనపడిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అది పుణే దిశగా వెళ్తోందని చెప్పారు. తుఫాన్‌తో ముంబై పూర్తిగా కుదుటపడ్డట్లేనని బృహన్ ముంబై నగర పాలక అధికారులు తెలిపారు. నగరం సురక్షితంగా ఉందని వెల్లడించారు. నిసర్గ తుఫాన్‌తో ఆస్తి నష్టం పెద్దగా లేదని వెల్లడించారు.

తుఫాన్ తీరం దాటే సమయంలో వీచిన బలమైన గాలుల వల్ల ముంబై, పుణేలోని పలు ప్రాంత్తాల్లో చెట్లు, విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు నేలకొరిగాయి. భారీ వృక్షాలు కూకటివేర్లతో సహా పెకిలించుకొని రోడ్లకు అడ్డంగా పడ్డాయి. పలు చోట్ల కార్లు, ఇతర వాహనాలపై భారీ వృక్షాలు కూలడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి.

nisarga,mumbai,toofan,india,maharastra ,ముంబై, పుణే, తుఫాన్, తీరం, వాణిజ్య నగరం

నిసర్గ తుఫాన్‌తో ప్రాణనష్టం సంభవించిన దాఖలాలేవీ లేవు. అటు గుజరాత్ తీర ప్రాంతంలోనూ తుఫాన్ ప్రభావం పెద్దగా లేదు. తుఫాన్ కారణంగా పుణే తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ముంబైకి ఆగ్నేయ దిశలో తుఫాన్ కేంద్రాన్ని గుర్తించారు. తీవ్ర తుఫాన్‌గా మారిన నిసర్గతో దేశ వాణిజ్య నగరానికి పెను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. కరోనా మహమ్మారితో అతలాకుతలం అవుతున్న నగరవాసులు ఈ వార్తలతో ఆందోళనకు గురయ్యారు. ముంబై నగరపాలక అప్రమత్తమైంది. సుమారు 15 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తొలగే వరకు వారు అక్కడే ఉంటారు.


Tags :
|
|
|

Advertisement