నిర్మలా సీతారామన్ తాజాగా రైతులకు తీపికబురు...
By: chandrasekar Thu, 12 Nov 2020 5:42 PM
కేంద్ర ఆర్థిక మంత్రి
నిర్మలా సీతారామన్ తాజాగా నిర్మలా సీతారామన్ రైతులకు శుభవార్త చెప్పారు.
అన్నదాతలకు రూ.65,000 కోట్ల ఫెర్టిలైజర్ సబ్సిడీ అందిస్తామని తెలిపారు.
దీంతో రైతులకు ఊరట కలుగనుంది. అలాగే దేశంలో ఉపాధి కల్పనను పెంచాలనే లక్ష్యంతో
కేంద్ర ప్రభుత్వం మరో కొత్త స్కీమ్ను తీసుకువచ్చింది. దీని పేరు ఆత్మనిర్భర్
భారత్ రోజ్గర్ యోజన.
ఆర్థిక వ్యవస్థను గాడిలో
పెట్టేందుకు ఆత్మనిర్భర్ 3.0లో భాగంగా నిర్మలా సీతారామన్ ఈ స్కీమ్ను
ప్రకటించారు. ఆత్మ నిర్భర్ భారత్ రోజ్గార్ యోజన స్కీమ్ ద్వారా దేశంలో ఉపాధి కల్పన
పెరుగుతుందని నిర్మలా సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈపీఎఫ్వోలో రిజిస్టర్
అయిన ప్రతి సంస్థకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. కంపెనీలు కొత్తగా ఉద్యోగులను
నియమించుకున్నా (2021 జూన్ 30 వరకు) లేదంటే మార్చి 1 నుంచి సెప్టెంబర్ 30
మధ్యలో ఉపాధి కోల్పోయిన వారు ఈ పథకం ద్వారా లాభం పొందొచ్చు
ఈ కొత్త స్కీమ్ 2020
అక్టోబర్ 1 నుంచే అమలులోకి వస్తుందని నిర్మలా సీతారామన్
ప్రకటించారు. వచ్చే రెండేళ్ల కాలం పాటు ఈ స్కీమ్ అమలులో ఉంటుంది. ఈ స్కీమ్లో
భాగంగా 1000కి
లోపు ఉద్యోగులు ఉన్న కంపెనీలు కొత్తగా ఉద్యోగులను చేర్చుకుంటే అప్పుడు వారి పీఎఫ్
కంట్రిబ్యూషన్ను, కంపెనీ పీఎఫ్ కంట్రిబ్యూషన్ను మొత్తంగా 24 శాతం
కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.
అదేసమయంలో 1000కి పైన
ఉద్యోగులు ఉన్న కంపెనీలు కొత్త వారికి నియమించుకుంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం
ఉద్యోగి కంట్రిబ్యూషన్ను చెల్లిస్తుంది. ఇక్కడ ఉద్యోగి వేతనం రూ.15,000లోపు ఉంటేనే ఇది వర్తిస్తుంది. అలాగే ఎమర్జెన్సీ క్రెడిట్ లిక్విడిటీ గ్యారంటీ
స్కీమ్ కింద 61 లక్షల మంది రుణ గ్రహీతలకు రూ.2.05 లక్షల
కోట్లు మంజూరు చేశామని నిర్మలా సీతారామన్ అన్నారు. ఇంకా 2.5 కోట్ల
మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందించామని తెలిపారు. ప్రధాన్ మంత్రి
మత్స్య సంపద యోజన ద్వారా రాష్ట్రాలకు రూ.1,700 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు.