Advertisement

  • కొత్త రకం కరోనా వైరస్... ఈ రోజు రాత్రి నుంచే ఇది అమల్లోకి...!

కొత్త రకం కరోనా వైరస్... ఈ రోజు రాత్రి నుంచే ఇది అమల్లోకి...!

By: Anji Tue, 22 Dec 2020 05:30 AM

కొత్త రకం కరోనా వైరస్... ఈ రోజు రాత్రి నుంచే ఇది అమల్లోకి...!

బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్‌ విజృంభిస్తున్న వేళ.. ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇటు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుస్తు చర్యలు చేపట్టాయి.

గడిచిన వారం రోజులుగా విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి పరీక్షలు నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.

మహారాష్ట్ర సర్కారు మరో ముందడుగు వేసి రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తూ ప్రకటన చేసింది. మంగళవారం (డిసెంబర్ 22) రాత్రి నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది.

ముంబై సహా పలు ప్రధాన నగరాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సోమవారం సాయంత్రం ప్రకటించారు.

రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు. జనవరి 5 వరకు ఇది కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర రాజధాని ముంబైతో పాటు పలు నగరాల్లో రాత్రి కర్ఫ్యూ ఉంటుందని చెప్పారు.

విదేశాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త కరోనా వైరస్‌ స్ట్రెయిన్ వ్యాప్తి నేపథ్యంలో అటు కర్ణాటక ప్రభుత్వం కూడా అలెర్ట్‌ అయ్యింది.

డిసెంబర్ 7 నుంచి రాష్ట్రంలో అడుగుపెట్టిన ప్రయాణికుల వివరాలు ఇవ్వాలని బెంగళూరు, మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలను కోరింది. బ్రిటన్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయాలని ఆదేశించింది.

Tags :

Advertisement