Advertisement

  • ఆ నగరంలో కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూ ఆంక్షలు పొడిగింపు

ఆ నగరంలో కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూ ఆంక్షలు పొడిగింపు

By: Sankar Mon, 07 Dec 2020 4:00 PM

ఆ నగరంలో కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూ ఆంక్షలు పొడిగింపు


కరోనా కట్టడి దృష్ట్యా అహ్మదాబాద్‌లో విధించిన రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు సోమవారం అధికారులు ప్రకటించారు. గత 24 గంటల్లోనే జిల్లాలో 306 కొత్త కేసులు నమోదయ్యాయి.

దీంతో అహ్మదాబాద్‌లో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 52,030 దాటేసింది. దీంతో కర్ఫ్యూ సమయాన్ని పొడిగిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ సం‍జయ్‌ శ్రీ వాస్తవ వెల్లడించారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని, దీని ప్రకారం రాత్రి 9 నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు ఉంటాయని తెలిపారు.

గతకొన్ని రోజులుగా జిల్లాలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతుండటంతో నవంబర్‌ 23న యంత్రాంగం కర్ఫ్యూ విధించింది. ఆ గడువు నేటితో (డిసెంబర్‌7) ముగియనుండగా, కరోనా కేసుల దృష్ట్యా కర్ఫ్యూను పాడిగిస్తున్నట్లు శ్రీవాస్తవ తెలిపారు. ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 188 కింద కేసు నమోదు చేస్తామని చెప్పారు.

Tags :
|

Advertisement