Advertisement

  • క్రికెట్ మైదానంలో మరొకసారి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్న కివీస్ కెప్టెన్ విలియంసన్

క్రికెట్ మైదానంలో మరొకసారి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్న కివీస్ కెప్టెన్ విలియంసన్

By: Sankar Thu, 03 Dec 2020 5:38 PM

క్రికెట్ మైదానంలో మరొకసారి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్న కివీస్ కెప్టెన్ విలియంసన్


కివీస్ క్రికెట్ టీం కెప్టెన్ కేన్ విలియంసన్ బ్యాటింగ్ లో ఎంతటి దిగ్గజ ఆటగాడో వ్యక్తిత్వంలో కూడా అదే స్థాయి ఆటగాడు ..అందుకే విలియంసన్ కు కేవలం న్యూజిలాండ్ లోనే గాక ప్రపంచ వ్యాప్తంగా ఆదరించే అభిమానులు ఉన్నారు...మ్యాచ్ ఓడిపోయినా , గెలిచినా విలియంసన్ మోహంలో చిరునవ్వు మాత్రం అలాగే ఉంటుంది ..అలాగే తోటి ఆటగాళ్లతో కూడా హుందాగా నడుచుకుంటూ ఉంటాడు..తాజాగా విలియంసన్ మరొకసారి తన గొప్ప వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు...

న్యూజిలాండ్ లోని హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్ , వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య తొలిటెస్ట్ నేడు ప్రారంభం అయింది...ఈ మ్యాచ్ ప్రారంభంలో ఇటీవలే తండ్రిని కోల్పోయిన కరేబియన్ క్రికెటర్ కెమర్ రోచ్‌ను మ్యాచ్ ప్రారంభానికి ముందు విలియమ్సన్ హత్తుకొని సంఘీభావం ప్రకటించాడు.

తోటి క్రికెటర్ పట్ల కివీస్ కెప్టెన్ వ్యవహరించిన తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో లాథమ్ వికెట్‌ను పడగొట్టిన రోచ్.. మోకాలిపై వాలిపోయి తండ్రిని గుర్తుకు తెచ్చుకొని భావోద్వేగానికి లోనయ్యాడు. రోచ్ తండ్రి మరణానికి సంతాప సూచికగా ఇరు జట్ల క్రికెటర్లు ఫస్ట్ టెస్టు తొలి రోజు నల్ల చేతి బ్యాండ్లను కట్టుకొని బరిలోకి దిగారు.

Tags :

Advertisement