Advertisement

  • ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వేధించడంతో వివాహిత ఆత్మహత్య

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వేధించడంతో వివాహిత ఆత్మహత్య

By: Sankar Mon, 17 Aug 2020 1:26 PM

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వేధించడంతో వివాహిత ఆత్మహత్య


వారిద్దరూ ప్రేమించుకున్నారు ..ఇంట్లో తెలిసి పెద్దవాళ్లు కాదనడంతో వాళ్ళని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు..అయితే పెళ్లయిన కొద్దీ కాలానికే భార్య ఆత్మహత్య చేసుకొని మరణించింది..వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నగర శివారు మల్కాజ్‌గిరి-మేడ్చల్ జిల్లాలో విషాదం నెలకొంది. కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాంపల్లిలో త్రినేయని(20) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

రాంపల్లిలో భర్త అక్షయ్‌తో కలిసి త్రినయని ఉంటోంది. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరు ఏడు నెలల క్రితం పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. అయితే కొద్దిరోజులు అక్షయ్ భార్యను తీవ్రంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక ఆమె తనలో తానే కుమిలిపోతోంది.

భర్త వేధింపులు మరింత తీవ్రం కావడంతో మనస్తాపానికి గురైన ఆమె సోమవారం ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు భర్తే తమ కూతురుని పొట్టన పెట్టుకున్నాడని ఆరోపిస్తూ కీసర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. త్రినేయని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి తరలించారు.

Tags :
|
|

Advertisement