Advertisement

  • మందు ఇప్పించలేదు అని పెళ్లి కొడుకును చంపిన స్నేహితులు

మందు ఇప్పించలేదు అని పెళ్లి కొడుకును చంపిన స్నేహితులు

By: Sankar Wed, 16 Dec 2020 8:11 PM

మందు ఇప్పించలేదు అని పెళ్లి కొడుకును చంపిన స్నేహితులు


పెళ్లి అంటేనే సందడి ...జీవితంలో ఒకేసారి జరిగే ఈ అద్భుత ఈవెంట్ లో ఒక్కొక్కరు ఒక్కోలాగా ఎంజాయ్ చేస్తారు ..కొందరు మద్యంతో ఎంజాయ్ చేస్తారు ..అయితే అలీఘడ్ లో ఒక పెళ్ళిలో మందు తక్కువ అయింది అని ఏకంగా పెళ్ళికొడుకుని చంపారు పెళ్లి కొడుకు స్నేహితులు..

28 ఏండ్ల బబ్లూ పెండ్లి సోమవారం జరిగింది. పెండ్లి తర్వాత గ్రామంలోని స్నేహితులను కలిసేందుకు వెళ్లగా.. వారు మద్యం ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. స్నేహితులంతా ఫూటుగా మద్యం సేవించి ఉండటంతో.. ఇంకా మద్యం తాగితే వారు ఇబ్బందిపడతారని భావించిన పెండ్లి కొడుకు.. వారికి మద్యం ఇప్పించేందుకు నిరాకరించాడు.

దాంతో స్నేహితులు అతడితో వాగ్వాదానికి దిగారు. అది కాస్తా ఘర్షణకు దారితీయడంతో వారు అక్కడే ఉన్న మద్యం సీసాతో పొడవడంతో పెండ్లికొడుకు బబ్లూ అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఘర్షణకు దారితీసేందుకు కారకుడైన రామ్‌ఖిలాడీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సర్కిల్‌ ఆఫీసర్‌ నరేశ్‌సింగ్‌ తెలిపారు.

Tags :
|

Advertisement