Advertisement

  • చిత్తూరు లో విషాదం పెళ్లయిన పదిరోజులకే కరోనా తో వరుడు మృతి

చిత్తూరు లో విషాదం పెళ్లయిన పదిరోజులకే కరోనా తో వరుడు మృతి

By: Sankar Thu, 20 Aug 2020 5:01 PM

చిత్తూరు లో విషాదం పెళ్లయిన పదిరోజులకే కరోనా తో వరుడు మృతి


చిత్తూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. వీ కోట మండలం నెర్నిపల్లెలో పెళ్లైన 10 రోజులకే నవ వరుడు చనిపోయాడు. గ్రామానికి చెందిన ఓ యువకుడికి పది రోజుల క్రితం ఘనంగా పెళ్లి చేశారు. కరోనా వ్యాప్తి ఉండటంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని వేడుక నిర్వహించారు. రెండు కుటుంబాల నుంచి కొంతమందిని మాత్రమే ఆహ్వానించారు.

ఆ తర్వాత వరుడు అనారోగ్యంతో బాధపడగా.. ముందస్తు జాగ్రత్తగా కరోనా టెస్ట్ నిర్వహించారు.. అందులో పాజిటివ్ తేలింది. వెంటనే బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్సపొందుతూ.. అతడి ఆరోగ్యం విషమించి గురువారం ఉదయం కన్నుమూశాడు. 10 రోజులకే వరుడు చనిపోవడంతో ఇరు కుటుంబాల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇలాంటి ఘటన ఇటీవల చాలానే జరిగాయి. కొంతమందికి పాజిటివ్ వచ్చి తర్వాత కోలుకోగా.. మరికొందరు మాత్రం చనిపోయారు. కొన్ని పెళ్లిళ్లు పీటల మీద ఆగిపోయాయి. ఏపీలో కూడా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మొత్తం కేసుల సంఖ్య 3లక్షలకుపైగానే ఉన్నాయి

Tags :
|
|
|

Advertisement