Advertisement

  • న్యూజిలాండ్‌ స్టార్ బౌలర్‌ ఐపీఎల్ లో మళ్ళీ ఎంట్రీ

న్యూజిలాండ్‌ స్టార్ బౌలర్‌ ఐపీఎల్ లో మళ్ళీ ఎంట్రీ

By: chandrasekar Thu, 10 Sept 2020 4:56 PM

న్యూజిలాండ్‌ స్టార్ బౌలర్‌ ఐపీఎల్ లో మళ్ళీ ఎంట్రీ


ఆరేళ్ల కిందట ఐపీఎల్‌ ఆడిన న్యూజిలాండ్‌ పేసర్‌ జేమ్స్‌ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ మెగా టోర్నీలో అడుగుపెట్టబోతున్నారు. ఈసారి కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ తరఫున బరిలోకి దిగనున్నాడు. 2014లో దిల్లీ తరఫున పలు మ్యాచ్‌లు ఆడిన అతడు జేమ్స్‌ నీషమ్‌ తర్వాత ఐపీఎల్ ఆడలేదు. ఐపీఎల్ 2020 దుబాయ్ వచ్చిన అతను పంజాబ్ జట్టుతో కలిసి ప్రాక్టీస్ మెుదలుపెట్టాడు. తాజాగా మీడియాతో మాట్లాడిన జేమ్స్‌,, "పంజాబ్‌ ఈసారి టైటిల్ సాధిస్తుంది. మళ్లీ ఐపీఎల్‌లో ఆడటం సంతోషంగా ఉంది. అనుభవం గల బౌలర్‌గా ఐపీఎల్‌కు ఆడటం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. గతంలో ఢిల్లీ టీం తరుపున ఆడాను. ఆ సమయంలో అవగహన లేకపోవడంతో కొంత ఇబ్బంది పడ్డానన్నారు" జేమ్స్‌

కానీ, ఐపీఎల్‌పై ఇప్పుడు స్పష్టమైన అవగాహన వచ్చింది. నా ఆలోచనలను ఇతరులతో పంచుకుంటున్నాను. జట్టులో క్రిస్‌గేల్‌, గ్లెన్‌మాక్స్‌వెల్‌ లాంటి స్టార్‌ ఆటగాళ్లు ఉన్నారు. కావునా ఖచ్చితంగా పంజాబ్ విజేతగా నిలుస్తుందనే అశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆటగాళ్లు, కెప్టెన్లు, కోచ్‌లు మారినా జట్టుకు మాత్రం సరైనా ఫలితం దక్కడం లేదు. టీమ్‌ఇండియా స్పిన్‌ దిగ్గజం అనిల్‌కుంబ్లేను జట్టు ప్రధాన కోచ్‌గా ఉన్నారు. ఈ సారైనా పంజాబ్ కప్ గెలవాలని అభిమానులు అశిస్తున్నారు. ప్రస్తుతం పంజాబ్ ఆటగాళ్లు నెట్స్ తీవ్రంగా సాధన చేస్తున్నారు.

Tags :
|

Advertisement