Advertisement

  • సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరొక ట్విస్ట్

సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరొక ట్విస్ట్

By: Sankar Wed, 09 Sept 2020 4:45 PM

సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరొక ట్విస్ట్


సీరియల్ నటి శ్రావణి బుధవారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి టిక్ టాక్ లో పరిచయమైన దేవరాజ్ అనే వ్యక్తే అని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు. దేవరాజ్ కు శ్రావణి సీరియల్ అవకాశాలు ఇప్పించిందని..అయినప్పటికీ శ్రావణిని అతడు వేధించేవాడని, వేధింపులు భరించలేకే ఆమె ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఇక ఈ ఘటనపై తాజాగా దేవరాజ్ స్పందించారు. శ్రావణి చావుకు సాయి అనే వ్యక్తి కారణమని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని శ్రావణినే స్వయంగా తనకు కాల్ చేసి చెప్పిందని తెలిపాడు. శ్రావణి కుటుంబసభ్యులు ఫోర్స్ చేయడం వల్లే తనపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని ఆవేదనవ్యక్తం చేసారు. గతంలో శ్రావణితో డిన్నర్ చేస్తున్న సమయంలో సాయి వచ్చి ఆమెపై చేయి చేసుకున్నాడని తెలిపాడు.

సాయి, శ్రావణి కుటుంబసభ్యులు ఆమెను కొట్టి హింసించేవారని వెల్లడించాడు. గతంలో కూడా శ్రావణి కుటుంబ సభ్యులు తనపై కేసు పెట్టారని ఆ తరవాత కూడా తాము కలుసుకున్నామని దేవరాజ్ చెప్పాడు..

Tags :

Advertisement