Advertisement

డిగ్రీ కోర్సుల్లో కొత్త సిలబస్

By: Dimple Tue, 14 July 2020 3:24 PM

డిగ్రీ కోర్సుల్లో కొత్త సిలబస్


ఏపీలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి విద్యకు తొలి ప్రాధాన్యమిస్తున్నారు. ఫీజులు, కోర్సులు, ఉద్యోగాలు తదితర విషయాల్లో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో 2020-21 ఏడాదికి అండర్ గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో కొత్త సిలబస్ ప్రవేశ పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. దీనిపై నిపుణుల కమిటీ ఆరు నెలల పాటు అధ్యయనం చేసి సిలబస్ రూపొందించింది. ఈ నూతన సిలబస్ ఈ విద్యా సంవత్సరం (2020-21) నుంచే అమలు కానుంది.

తొలిసారిగా ఉన్నత విద్యాకోర్సుల్లో అవుట్‌ కమ్‌ బేస్డ్‌ సిలబస్‌ ప్రవేశపెడుతున్నారు. సోమవారం ఉన్నత విద్యామండలి రూపొందింపచేసిన చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ (సీబీసీఎస్‌)కు సంబంధించిన అంశాలను విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ మీడియాకు వెల్లడించారు.

విద్యార్థుల్లో నైపుణ్యత పెంచేలా లైఫ్ స్కిల్ కోర్సులను డిగ్రీ కోర్సుల్లో ప్రవేశపెట్టనున్నారు. కొత్త సిలబస్‌లో భాగంగా మొట్టమొదటి సారిగా పదినెలల ఇంటర్న్‌షిప్‌‌ తప్పనిసరి చేయనున్నారు. ఆన్‌లైన్‌, మాక్ కోర్సుల ఆధారంగా విద్యార్థులను ప్రోత్సహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్, నేషనల్ గ్రీన్‌ కోర్‌కు ప్రాధాన్యత ఇచ్చేలా విద్యార్థులకు కమ్యూనిటీ సర్వీస్‌లు పెంచేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ సిలబస్ మార్పు వల్ల విద్యార్థుల్ఓ నైపుణ్యం పెరగడం, ఉద్యోగ కల్పన, ఉపాధికి ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వం భావిస్తోంది.

సిలబస్‌లో ముఖ్యాంశాలు:

* ఫౌండేషన్‌ కోర్సుల స్థానంలో లైఫ్‌ స్కిల్‌ కోర్సులను ప్రవేశపెట్టడం

* లైఫ్‌ స్కిల్‌ కోర్సులను ఎంపిక చేసుకొనే అవకాశం విద్యార్థులకే కల్పించడం

* నైపుణ్యాభివృద్ధిని పెంపొందించే దిశగా స్కిల్‌ డెవలప్‌మెంట్, స్కిల్‌ ఎన్‌హేన్స్‌మెంటు కోర్సులకు రూపకల్పన

* సీఎం జగన్‌ సూచనల మేరకు తొలిసారి విద్యార్థులందరికీ 10 నెలల నిర్బంధ అప్రెంటీస్‌షిప్, ఇంటర్న్‌షిప్‌ (ఉద్యోగావకాశాల మెరుగుకు) ఈ సిలబస్‌ ప్రత్యేకత.


Tags :
|

Advertisement