మలేరియా జాతి కొత్త పరాన్న జీవి కేరళలో కలకలం...
By: Sankar Fri, 11 Dec 2020 9:06 PM
మలేరియా జాతికి చెందిన కొత్త పరాన్నజీవి కేరళలో కలకలం రేపుతోంది. ఇటీవల సూడాన్ నుంచి కేరళకి వచ్చిన ఓ సైనికుడి శరీరంలో దీన్ని కనుగొన్నారు. అతడి ద్వారా వచ్చిన ఈ కొత్త జాతి ‘ప్లాస్మోడియం ఒవల్గా’ గుర్తించారని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కెకె.శైలజ తెలిపారు.
అతనికి కన్నూర్లోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు గురువారం ట్విటర్ వేదికగా ఆమె స్పందించారు. నివారణ చర్యలు చేపట్టడం ద్వారా, తగిన సమయానికి చికిత్స తీసుకోవటం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చు అని ఆమె పేర్కొన్నారు...
కాగా, భారత్లో తొలి కరోనా వైరస్ కేసు కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో నమోదయ్యింది. చైనాలోని వూహాన్ యూనివర్శిటీలో చదువుతున్న ఓ విద్యార్ధి అక్కడినుంచి భారత్ వచ్చాడు. అతడిలో కరోనా వైరస్ను గుర్తించారు. అంతేకాకుండా 2018లో వచ్చిన నిఫా వైరస్ కూడా ఇక్కడి కొజికొడ్ జిల్లాలో వెలుగుచూసింది..