Advertisement

దేశ రాజధానిలో భారీగా కరోనా కేసులు...

By: Sankar Tue, 15 Sept 2020 09:05 AM

దేశ రాజధానిలో భారీగా కరోనా కేసులు...


దేశ రాజధాని ఢిల్లీలో అగ్గింది అనుకున్న కరోనా గత కొద్దీ రోజులుగా మళ్ళీ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది..కరోనా తొలి నాళ్లలో భారీ కేసులు నమోదు అయినప్పటికీ తర్వాత కాలంలో తగ్గుముఖం పట్టాయి...ఢిల్లీ కరోనా ను జయించినట్లే అని భావిస్తుండగా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి..

తాజాగా గడచిన 24 గంటలలో న్యూఢిల్లీలో 3,229 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 3,374. మృత్యువాత పడిన వారి సంఖ్య 26గా ఉంది. దీంతో​ ఢిల్లీ మొత్తం కేసుల సంఖ్య 2,21,533కు చేరుకోగా.. మృతుల సంఖ్య 4,770 చేరుకుంది. కోవిడ్‌ కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో 1,88,122 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 28,641 ఉండగా..

(సోమవారం) 9,859 మందికి కరోనా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. అదే విధంగా ఇవాళ ఒక్కరోజే 35,025 మందికి ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించడంతో కరోనా పరీక్షల సంఖ్య 21,84,316లకు చేరుకుంది. రాజధానిలో హోం ఐసోలేషన్‌లో 16,568 మంది ఉండగా.. కంటైన్మెంట్ జోన్‌లలో 1517 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు..

ప్రస్తుతం ఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో దాదాపు 4,4091 బెడ్లు అందుబాటులో ఉండగా.. ప్రతి మిలియన్ జనాభాలో 1,14,964 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు న్యూఢిల్లీ ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Tags :
|

Advertisement