ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 141 కరోనా కేసులు
By: chandrasekar Fri, 05 June 2020 6:54 PM
ఏపీలో కరోనా కేసులు
ఎక్కువవుతూనే వున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారు, లోకల్ కాంటాక్ట్, వలస
కూలీలతో కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 9,986 శాంపిల్స్ను పరీక్షించగా 98 మందికి కరోనా పాజిటివ్గా తేలినట్లు మీడియా బులిటెన్లో
వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన 43మందికి కరోనా నిర్థారణ అయ్యింది. ఈ మొత్తం కేసుల
సంఖ్య 141 నమోదయ్యాయి. కొద్దిరోజులుగా జిల్లాల వారీగా కేసుల
వివరాలను ప్రభుత్వం తెలియజేయలేదు. తాజా కేసులు కలిపితే మొత్తం సంఖ్య 3377కు చేరాయి. మరో 29మంది
వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా రాష్ట్రంలో యాక్టివ్
కేసుల సంఖ్య 1033కు
చేరింది.
ఆంధ్ర లో అత్యధికంగా
కర్నూలు జిల్లాలో 700పైగా
పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లాలో 450కు పైగా కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి
వరకు 2273మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి
డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మొత్తం 71మంది చనిపోయారు. గత 24 గంటల్లో కోవిడ్ వల్ల ముగ్గురు చనిపోయారు చిత్తూరు
జిల్లాలో ఇద్దరు కృష్ణా జిల్లా, గుంటూరు
జిల్లా, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు.
ఇప్పుడు నమోదవుతున్న
కరోనా కేసుల్లో చిత్తూరు, నెల్లూరు
జిల్లాలతో పాటూ మరికొన్ని జిల్లాల్లో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కోయంబేడు
మార్కెట్ లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆ లింకులతో 19 కేసులు నమోదయ్యాయి అలాగే విదేశాల నుంచి వచ్చిన
వారిలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో కొత్త నమోదైన
పాజిటివ్ కేసుల్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కమ్యులేటివ్ పాజిటివ్ కేసులు 616 (వీటిలో యాక్టివ్ కేసులు 372) ఉన్నాయని ప్రకటించారు. అలాగే విదేశాల నుంచి వచ్చిన 119మందికి వైరస్ సోకినట్లు తెలియజేశారు. అయితే కోయంబేడు
లింకులతో పాటూ విదేశాల నుంచి వచ్చిన వారితో టెన్షన్ వెంటాడుతోంది. పాజిటివ్ కేసుల
సంఖ్య రోజు రోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అందువలన ప్రభుత్వం ఇతర రాష్ట్రాల
నుంచి వచ్చేవారికి పరీక్షలు నిర్వహిస్తోంది.