Advertisement

  • ఆర్సీబి బౌలింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సెహ్వాగ్

ఆర్సీబి బౌలింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సెహ్వాగ్

By: Sankar Tue, 29 Sept 2020 7:57 PM

ఆర్సీబి బౌలింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సెహ్వాగ్

ముంబై ఇండియన్‌-రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగిన మ్యాచ్‌ చివరకు సూపర్‌ వరకూ వెళ్లింది. మరి సూపర్‌ ఓవర్‌లో ముంబై బ్యాట్‌ ఝుళిపించి హిట్టింగ్‌కు దిగుతుందని అంతా అనుకుంటే వారి ఏడు పరుగులే చేశారు.దీనితో బెంగుళూరు బావెర్ సైని మీద అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు...

తాజాగా టీమిండియా మాజీ డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌.. ఆర్సీబీని కొనియాడుతున్నాడు. ప్రత్యేకంగా సైనీ వేసిన సూపర్‌ ఓవర్‌ను కొనియాడుతున్నాడు. ‘నువ్వు ఎవర్ని నమ్మొచ్చో.. ఎవర్ని నమ్మకూడదో అది నువ్వు ఎంచుకోవచ్చు. కానీ జీవితంలో నమ్మకూడదని ఏదైనా ఉందంటే అది ఆర్సీబీ డెత్‌ ఓవర్ల బౌలింగ్‌. ఈ మ్యాచ్‌ను ముంబై ఈజీగా గెలుస్తుందని అనుకున్నా. కానీ దాన్ని వారు సూపర్‌ ఓవర్‌ వరకూ తీసుకెళ్లారు.

ఈ మ్యాచ్‌లో క్రెడిట్‌ ఎవరికైనా ఇవ్వాలంటే తొలుత నవదీప్‌ సైనీకి ఇవ్వాలి. డెత్‌ ఓవర్లలో సూపర్‌గా బౌలింగ్‌ చేశాడు. ఇక సూపర్‌ ఓవర్‌లో ఇరగదీశాడు. అదే సమయంలో 12 పరుగులే ఇచ్చిన వాషింగ్టన్‌ సుందర్‌ కూడా ఆర్సీబీ విజయంలో ప్రధాన పాత్రధారి. వీరిద్దరూ రాణించకపోతే ఆర్సీబీ కచ్చితంగా ఓడిపోయేది. ఆర్సీబీ డెత్‌ ఓవర్ల బౌలింగ్‌ను మాత్రం ఎప్పటికీ ఎవరూ నమ్మరు’ అని సెహ్వాగ్‌ తెలిపాడు.

Tags :
|
|
|
|

Advertisement