నెటిజన్లు క్రికెటర్ షకీబ్ ను కత్తితో నరికి ముక్కలు చేయండి అంటూ కామెంట్లు...
By: chandrasekar Wed, 18 Nov 2020 2:09 PM
బంగ్లాదేశ్ క్రికెటర్
షకీబ్ దసర పండుగ సందర్భంగా కోల్ కత్తాలో దుర్గామాత పూజల్లో పాల్గొన్నారు. ఈ స్సందర్బంగా క్రికెటర్ షకీబ్ అల్ హసన్
క్షమాపణలు చెప్పారు.
ఈ పూజలపై ముస్లిం మత
పెద్దలు,నెటిజన్లు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్
మీడియాలో పలువురు నెటిజన్లు షకీబ్ ను కత్తితో నరికి ముక్కలు చేయండి అంటూ కామెంట్లు
చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై షకీబ్ స్పందించారు.
కోల్ కత్తాలో జరిగిన
దుర్గామాత పూజల్లో పాల్గొనాలంటూ మేయర్ ఫిర్హద్ హకీమ్ పిలుపునిచ్చినట్లు చెప్పారు.
ఆహ్వానం ప్రకారం తాను
కోల్ కత్తాకు వెళ్లినట్లు చెప్పిన క్రికెటర్ కాళీ మాత ఉత్సవాల్ని తాను
ప్రారంభించలేదని స్పష్టం చేశారు.
ముస్లిం మతాన్ని
గౌరవిస్తానని, ఆచారాల్ని, సాంప్రదాయాల్ని పాటిస్తామని చెప్పారు. కాగా
బంగ్లాదేశ్ కు చెందిన ఈ స్టార్ క్రికెటర్ 2సంవత్సరాల పాటు క్రికెట్ ఆడకుండా ఐసీసీ బ్యాన్
విధించింది.
ఇండియాకు చెందిన బుకీతో
సంప్రదింపులు జరిపినట్లు తేలడంతో ఐసీసీ బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.