ట్విట్టర్లోకి అఫీషియల్గా అడుగుపెట్టిన కంగనాకి నెటిజన్స్ భారీ షాక్
By: chandrasekar Tue, 01 Sept 2020 1:35 PM
సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్లో నెపోటిజం..ఫేవరెటిజం చూపించే వారిని వ్యతిరేకించాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. సోషల్ మీడియాలో వారిని అన్ ఫాలో అవ్వాలంటూ కొందరు పిలుపునిచ్చారు. దాంతో చాలా మంది సెలబ్రెటీల ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య తగ్గుతోంది. సుశాంత్ మరణం తర్వాత కంగనా రనౌత్ ఆయనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ వస్తుంది. అలానే పలు విషయాలపై తన వాదనలు వినిపిస్తుంది.
ఇటీవల ట్విట్టర్లోకి అఫీషియల్గా అడుగుపెట్టిన కంగనాకి నెటిజన్స్ భారీ షాక్ ఇచ్చారు. ఓ నెటిజన్ ..
మీ ఫాలోవర్స్ ప్రతి రోజు 40-50 వేల వరకు పడిపోతున్నారు అంటూ కంగనాకి ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన కంగనా..నేను ఈ విషయాన్నీ గమనించా. ఈ ప్రదేశం నాకు కొత్త. ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియడం లేదు. జాతీయవాదులు ప్రతి చోట కష్టపడాల్సి వస్తుంది. రాకెట్ చాలా బలంగా ఉంది. కంగనా...
అన్ఫాలో చేసిన వారికి హృదయపూర్వక క్షమాపణలు అని తెలిపింది.