Advertisement

  • కెపి ఓలి మీద తీవ్ర విమర్శలు చేసిన నేపాలీ కాంగ్రెస్ పార్టీ ..

కెపి ఓలి మీద తీవ్ర విమర్శలు చేసిన నేపాలీ కాంగ్రెస్ పార్టీ ..

By: Sankar Fri, 17 July 2020 11:25 AM

కెపి ఓలి మీద తీవ్ర విమర్శలు చేసిన నేపాలీ కాంగ్రెస్ పార్టీ ..



భారత్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్న నేపాల్ ప్రధాని కెపి ఓలి మీద సొంత దేశానికి చెందిన వారే తీవ్ర విమర్శలు చేస్తున్నారు ..తాజాగా రాముడు నేపాలుకి చెందిన వాడు అని , అయోధ్య నేపాల్లో ఉంది అని కెపి ఓలి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే..తాజాగా ఈ వివాదాస్పద వ్యాఖ్యలను నేపాలీ కాంగ్రెస్​ ఖండించింది.

నీతినియమాలను, రాజకీయ స్థిరత్వాన్ని కోల్పోయిన ఆయన దేశానికి ప్రధానిగా పనికిరాడంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అయోధ్య నేపాల్​లోని బిర్గంజ్​లో ఉందని, శ్రీరాముడి జన్మస్థలం నేపాలేనని ఓలి చేసిన కామెంట్లపై అధికార కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాలని కోరింది..

ప్రధాని పని తీరు అసలు బాలేదు. ఆయన మాటలు ఒకలా, చేతలు మరోలా ఉంటున్నాయి. ఆయన్ను ప్రధానిగా కొనసాగించడంపై కమ్యూనిస్టు పార్టీ పునరాలోచించుకోవాలి లేదా ఆయన్ను తీరు మార్చుకోమని సూచించాలి’ అని నేపాలీ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బిశ్వో ప్రకాశ్ శర్మ పేర్కొన్నారు..అయితే భారత్ మీద విమర్శల నేపథ్యంలో సొంత పార్టీ వాళ్ళు కూడా కెపి ఓలి మీద విమర్శలు చేయడంతో ఆయన పదవికే ముప్పు ఏర్పడింది ..

Tags :
|
|
|
|

Advertisement