Advertisement

  • నేపాల్-భారత్ వివాదం.. చైనా నేపాల్ ని రెచ్చగొడుతోందన్న సందేహం

నేపాల్-భారత్ వివాదం.. చైనా నేపాల్ ని రెచ్చగొడుతోందన్న సందేహం

By: chandrasekar Fri, 22 May 2020 2:19 PM

నేపాల్-భారత్ వివాదం..  చైనా నేపాల్ ని రెచ్చగొడుతోందన్న సందేహం


భారత్ – నేపాల్ మధ్య కొత్త రహదారి వేయుట వివాదానికి దారితీసింది. భారతీయులు పవిత్రంగా భావించే టిబెట్ లోని మానస సరోవర్ యాత్రకు చేరుకోవడానికి భారత దేశం ఉత్తరఖండ్-నేపాల్ యొక్క సరిహద్దుల్లో లిపులేఖ్ మార్గాన్ని నిర్మించింది. దీనిపై నేపాల్ అభ్యంతరం తెలియజేసింది నేపాల్ ఏకంగా సాయుధ పోలీస్ దళాన్ని కాలాపానీ సమీపంలో చుట్టుముట్టి భారత్ తో కయ్యానికి కాలుదువ్వింది.

శివుడు కొలువై ఉంటాడని అని నమ్మే భారతీయుల కైలాసమైన టిబెట్ లోని మానస సరోవర్ యాత్రకు భారత్ నుంచి సిక్కిం, ఉత్తరాఖండ్, నేపాల్ ద్వారా వెళుతుంటారు. ఈ యాత్రకు ఇప్పటి వరకు వ్యయప్రయాసలకు ఓర్చి ప్రయాణించాల్సి వచ్చేది. చైనా భూభాగం నుంచి 9 కి.మీలు నడిచే వెళ్లాల్సి ఉండేది. దీంతో భారత్ ఉత్తరాఖండ్ లోని దర్బులా రోడ్డుకు కలుపుతూ లిపులేఖ్ పాస్ రోడ్డును ఈనెల 8న భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించాడు. దీని ద్వారా మానససరోవర్ కు తొందరగా చేరుకోవచ్చు. ఇదే నేపాల్ అగ్రహానికి కారణమై చిచ్చు రేగింది.

nepal,india,conflict,china,boarder issue ,నేపాల్, భారత్, వివాదం, చైనా, సందేహం


భారత్ తమ భూభాగంలో రోడ్డు నిర్మించిందని నేపాల్ దేశం వ్యతిరేకత చూపించింది. ఈ భాగం మాదేనంటున్న నేపాల్. భారత్ లోని లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలు తమవి అంటూ తాజాగా కొత్త మ్యాపును నేపాల్ మంత్రిమండలి ఆమోందించి తీర్మానాన్ని నేపాల్ ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది . గత పాలుకుల మాదిరి తాము భారత్ కు ఆ ప్రాంతాలు విడిచిపెట్టమని మేము దక్కించుకుంటామని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ వ్యాఖ్యలు చేశారు. కాగా నేపాల్ కొత్త మ్యాప్ పై భారత్ దీటుగా స్పందించింది. నేపాల్ సరిహద్దులకు సంబంధించి ఈ కొత్త మ్యాప్ ను తాము అంగీకరించబోమని.. ముమ్మాటికీ లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలు భారత్ లోని అంతర్భాగమని ఆయన అన్నారు.

nepal,india,conflict,china,boarder issue ,నేపాల్, భారత్, వివాదం, చైనా, సందేహం


నేపాల్ ఇలా రెచ్చిపోవుటకు వెనుక చైనాఉందా? చైనా అండతోనే నేపాల్ రెచ్చిపోతుందని వివాదాన్ని రాజేస్తోందని భారత్ అనుమానిస్తోంది. ప్రస్తుతం మానస సరోవర్ యాత్ర కోసం భారత్ వేసిన రోడ్డు చైనా సరిహద్దు వరకు ఉంది. యుద్ధ సమయంలో మన సైనికులు అక్కడికి తొందరగా చేరుకునేలా ఈ రోడ్డు ఉంది. దీంతో రక్షణ పరంగా వూహాత్మకంగా మన దేశానికి ఈ రహదారి కీలకమైంది. అందుకే నేపాల్ తో ఈ ప్రాంతాన్ని దక్కించుకునేందుకే చైనా ఇలా చేస్తుందని .. నేపాల్ ను రెచ్చగొడుతోందని భారత్ భావిస్తోంది.

ఇప్పటివరకు భారత్ కు సపోర్ట్ గా ఉండే తోటి దేశం నేపాల్ ఈ వివాదంలో చైనా చేతిలో కీలుబొమ్మగా మారిందన్న అనుమానాలను భారతీయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. నేపాల్ తో చెడిన సంబంధాలు. అక్కడి ప్రధాని చైనా అండతో చెలరేగిపోతున్నారన్న అనుమానాలకు బలం చేకూరేలా పరిణామాలు వేగంగా చోటుచేసుకున్నాయి. భారతీయుల పవిత్రక్షేత్రం మానస సరోవర్ కు రాకుండా.. చైనాకు డైరెక్ట్ రూట్ లేకుండా చేయాలనే నేపాల్ తో ఇలా చేయిస్తోందన్న అనుమానాలు కలుగుతున్నాయి.

Tags :
|
|
|

Advertisement