Advertisement

  • బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి విజయ బాటలో...

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి విజయ బాటలో...

By: chandrasekar Wed, 11 Nov 2020 09:22 AM

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి విజయ బాటలో...


బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి విజయ బాటలో వుంది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికార ఎన్‌డీఏ కూటమి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. 243 స్థానాలున్న బిహార్‌లో అసెంబ్లీలో మ్యాజిక్‌ఫిగర్‌కు అవసరమైన సీట్ల కన్నా ఎక్కువ సీట్లు సాధించింది. ఇందువల్ల స్పష్టమైన మెజారిటీని సాధించింది. అధికారం చేపట్టేందుకు 122 అసెంబ్లీ స్థానాలు అవసరం కాగా నేషనల్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌ - ఎన్‌డీఏ 124 సీట్లు సాధించింది. మరో ఒక స్థానంలో ముందంజలో ఉంది. ఆర్‌జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌ 109 స్థానాల్లో విజయం సాధించింది మరొక స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఎన్‌డీఏ కూటమి నుంచి బయటకు వెళ్లిన ఎల్‌జేపీ కేవలం ఒకే సీటుకు పరిమితమైంది. బీజేపీ మంచి ఆధిక్యాన్ని సాధించింది.

ఇక్కడ ఇతరులు ఏడు చోట్ల విజయం సాధించారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు 103 స్థానాల్లో ఫలితాలు వెలువడగా ఎన్‌డీఏ కూటమి 54, మహాఘట్‌బంధన్‌ 44 చోట్ల విజయం సాధించింది. ఎన్‌డీఏలో బీజేపీ 32, జేడీయూ 19, వీఐపీ 2, హెచ్‌ఏఎం పార్టీ ఒక స్థానాల్లో గెలుపొందగా 69 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. మహాకూటమిలోని ఆర్జేడీ 29, కాంగ్రెస్‌ ఏడు, లెఫ్ట్ పార్టీల అభ్యర్థులు ఎనిమిది మంది విజయం సాధించగా 69 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఏఐఎంఐఎం మూడు చోట్ల విజయం సాధించగా మరో చోట ఆధిక్యంలో ఉంది. అలాగే బీఎస్పీ ఒక స్థానంలో విజయం సాధించగా మరో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించాడు. మోడీ మరియు నితీష్ కుమార్ ల కూటమి బాగా పనిచేసింది.

Tags :
|

Advertisement