కంగనా చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధమని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వ్యాఖ్యలు
By: chandrasekar Sat, 12 Sept 2020 5:12 PM
నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్
జూన్లో ముంబైలోని తన నివాసంలో శవమై తేలిన తరువాత కటి కంగనా రనౌత్ హిందీ చిత్ర
పరిశ్రమపై పలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో బృహన్ ముంబై
మునిసిపల్ కార్పొరేషన్ కూల్చివేసిన నటి
కంగనా రనౌత్ భవనంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, నాపై ఆమె చేసిన ఆరోపణలు
పూర్తిగా అబద్ధమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్
అన్నారు. గురువారం విలేకరుల సమావేశంలో
మాట్లాడిన పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కూల్చివేసిన భవనం ఎన్సీపీ
చీఫ్కు చెందినదని కంగనా రనౌత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందించారు. నటుడు
సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్లో ముంబైలోని తన నివాసంలో శవమై తేలిన తరువాత కటి
కంగనా రనౌత్ హిందీ చిత్ర పరిశ్రమపై పలు ఆరోపణలు చేస్తూ వచ్చింది. సంగతి తెలిసిందే.
ముంబైను ఆమె పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్తో పోల్చగా ఈ వ్యాఖ్యలు పెద్ద సంచలనం
సృష్టించాయి.