కేబీసీ 12లో రూ.7 కోట్ల ప్రశ్నకు 'నాజియా నసీమ్' మిస్ ఐన సమాధానం...
By: chandrasekar Thu, 12 Nov 2020 11:25 AM
జార్ఖండ్ రాష్ట్రానికి
చెందిన రాంచీ నివాసి అయిన నాజియా నసీమ్ పేరు కేబీసీ వేదికతో ఒక్కసారిగా
మార్మోగిపోతోంది. సీజన్ 12లో మొట్టమొదటి కోటీశ్వరురాలు నాజియా నసీమ్. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్
వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కేబీసీ సీజన్ 12లో తొలి కోటీశ్వరురాలిగా నాజియా నసీమ్ గుర్తింపు
పొందారు. ప్రస్తుతం ఢిల్లీలో సెటిల్
అయ్యారు. అయితే కోటి రూపాయాల ప్రశ్నకు సమాధానం చెప్పిన నాజియా నసీమ్ రూ.7 కోట్ల
ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయారు.
రూ.25 లక్షల
రూపాయల వరకు ప్రశ్న ఒక్క లైఫ్లైన్ కూడా ఆమె వినియోగించుకోలేదు. ఈ నేపథ్యంలో లైఫ్లైన్స్
వాడుకుంటూ రూ.కోటి రూపాయాల ప్రశ్నకు బదులిచ్చారు. ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ
అవార్డు అందుకున్న నటి ఎవరు? అనే
ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లలో సరైన సమాధానం రూపా గంగూలీ అని ఠక్కున నాజియా నసమీమ్
సమాధానం చెప్పారు. దీంతో ఆమె రూ.7కోట్ల ప్రైజ్ మనీ సైతం గెలుచుకుంటారని అంతా
భావించారు.
రూ.7 కోట్ల
ప్రశ్న....
నేతాజీ సుభాస్ చంద్రబోస్
ఆజాద్ హింద్ ప్రభుత్వం మొదటి ప్రకటన సింగపూర్లో ఎక్కడ చేశారు?
A) కాతే
సినిమా హాల్ B) ఫోర్ట్
క్యానింగ్ పార్క్ C) నేషనల్
యూనివర్సిటీ అఫ్ సింగపూర్
D) నేషనల్ గేలరీ
సింగపూర్ ఆప్షన్లు ఇచ్చారు. కానీ
నాజియా నసీమ్ సమాధానం చెప్పలేకపోయారు.
రూ.7 కోట్ల
ప్రశ్నకు సమాధానం : ఆప్షన్ A
బ్రిటన్ టీవీ షో ఆధారంగా
కౌన్ బనేగా కరోడ్పతి రూపొందించారు. కేబీసీ 3వ సీజన్ షారుక్ ఖాన్ హోస్ట్గా వ్యవహరించారు. 2000
సంవత్సరంలో ప్రారంభమైన కేబీసీ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. బాలీవుడ్ మెగా
స్టార్ అమితాబ్ బచ్చన్ కేబీసీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారని తెలిసిందే.