కరోనా సోకడంతో నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించింది
By: chandrasekar Tue, 11 Aug 2020 7:10 PM
మహారాష్ట్రలోని అమరావతి
ఎంపీగా వ్యవహరిస్తున్న నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించింది. ఈమె తెలుగులో పలు సినిమాల్లో నటించింది. కొద్దిరోజుల క్రితం ఆమెకు కరోనా సోకింది. దీంతో
ఆమె అమరావతిలోని ఓ ఆస్పత్రిలో చేరారు. గత ఆరు రోజులుగా ఆమె అక్కడే చికిత్స
పొందుతున్నారు. అయితే హఠాత్తుగా ఆరోగ్య
పరిస్థితి క్షీణించడంతో ఆమెను వెంటనే నాగ్పూర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి
తరలించారు.
కొద్ది రోజుల క్రితం
నవనీత్ కౌర్తో పాటు ఎమ్మెల్యే అయిన ఆమె భర్త రవి రానాకు కరోనా పాజిటివ్ అని
నిర్ధారణ అయ్యింది. వారితో పాటు వారి కుటుంబంలోని మొత్తం 11 మంది
కరోనా బారిన పడ్డారు. ఇందులో వీరి పిల్లలు కూడా ఉన్నారు. తనకు కరోనా సోకినట్టు
నిర్ధారణ కావడంతో తనను కలిసిన వారంతా
కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించిన సంగతి తెలిసిందే. 2019లో
బీజేపీ తరపున అమరావతి ఎంపీ టికెట్ ఆశించి అది కుదరక పోవడంతో నవనీత్ కౌర్ స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం
సాధించారు.