Advertisement

దేశవ్యాప్తంగా ఒక్కరోజు లో 194 మంది మృతి

By: chandrasekar Fri, 29 May 2020 5:22 PM

దేశవ్యాప్తంగా ఒక్కరోజు లో 194 మంది మృతి


దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు య‌ధావిధిగా పెరుగుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్య కూడా పెరుగుతూనేవుంది. అన్ని ప్రాంతాలలో కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త వైర‌స్ కేసుల సంఖ్య 6566గా న‌మోదు అయ్యింది.

ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి సంఖ్య 194గా ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా న‌మోదు అయిన కరోనా వైర‌స్ కేసుల సంఖ్య 1,58,333గా ఉంది. దీంట్లో 86110 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 67692 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 4531కి చేరుకున్న‌ది.

Tags :
|
|

Advertisement