చంద్రుడి పరిణామంలోని వస్తువొకటి భూమి వైపు కదులుతున్నట్లు గుర్తించిన నాసా
By: chandrasekar Wed, 30 Sept 2020 5:34 PM
అంతరిక్షంలో చెత్త
పెరిగిపోవడం భూమికి ఆపద కలిగిస్తోంది. నాసా శాస్త్రవేత్తలు అలాంటి మరో ప్రమాదాన్ని
ఇప్పుడు గుర్తించారు. ఒక చిన్న చంద్రుడి
అంత పరిణామంలోని వస్తువొకటి భూమి వైపు కదులుతున్నట్లు నాసా గుర్తించింది. నాసా
అంచనాలు కరెక్టయితే అది భూమి నుండి 27,000 మైళ్ళ దూరం వరకు సురక్షితంగా వెళుతుంది. కానీ
ప్రమాదం ఏమిటంటే, భూమి గురుత్వాకర్షణ సామర్థ్యం కారణంగా ఇది 2020
అక్టోబర్ నుంచి 2021 నవంబర్ వరకు ఒక సంవత్సరం పాటు భూమికి దగ్గరగా
ఉండగలదు. వాస్తవానికి ఇది 1960 లో ప్రయోగించిన రాకెట్ అని, మధ్యలో
చాలా ఏండ్లపాటు కనిపించకుండా పోయిన రాకెట్ అని అంతరిక్ష శాస్త్రవేత్తలు తెలిపారు.
డాక్టర్ పాల్ చాదాస్ ప్రకారం.. ఈ అంతరిక్ష వస్తువు సాధారణ విషయం కాదు. నాసా దీనికి
2020 ఎస్ఓ
అని పేరు పెట్టింది. దీని పరిమాణం 20 నుంచి 45 అడుగుల ప్లాట్కు సమానం. ఇది ఒక కృత్రిమ వస్తువు.
సుమారు ఒక సంవత్సరం సూర్యుని చుట్టూ తిరుగుతున్నది. ఇది గంటకు 3,025
కిలోమీటర్ల వేగంతో భూమికి దగ్గరగా ఉంటుంది.
భూమికి దగ్గరగా వెళ్ళే
స్టెరాయిడ్ల కన్నా చాలా తక్కువ. దీన్ని మొదట 2020 సెప్టెంబర్ 17న కనుగొన్నారు. ఇది ఒక సంవత్సరం పాటు భూమి చుట్టూ
ఉంటుంది. అయితే నవంబర్లో మరింత దగ్గరగా ఉంటుంది. 2020 డిసెంబర్ 1న భూమి
నుంచి దాని దూరం నాలుగు వేల కి.మీ. అదే సమయంలో 2021 ఫిబ్రవరి 2 న ఇది
రెండున్నర మిలియన్ కిలోమీటర్ల దూరంలో నడుస్తుంది.
ఇది యాభై సంవత్సరాల క్రితం వదిలివేసిన రాకెట్. ఇది సర్వేయర్ -2 మిషన్
కింద 1966
సెప్టెంబర్ 20న విడుదల చేయబడింది. చంద్రుని గురించి సమాచారం
సేకరించడానికి ఈ అంతరిక్ష నౌకను పంపారు. అయితే, అంతరిక్ష నౌకలో పేలుడు కారణంగా మిషన్ విఫలమైంది.
అప్పటి నుంచి ఈ రాకెట్ అంతరిక్షంలో తిరుగుతున్నది. చంద్రుడితో ఢీకొన్న తరువాత కొంత
భాగం కూలిపోయింది. అయితే, నాసా ప్రకారం,
2020 ఎస్ఓపై పడే సూర్య కిరణాల సహాయంతో వారు మరింత
సమాచారం సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు. నాసా కూడా ఇది రాకెట్ అయితే సూర్యుడి
వల్ల దాని వేగం ప్రభావితమవుతుందని పేర్కొన్నారు.