మరింత క్షీణించిన నర్సింహా రెడ్డి ఆరోగ్యం...
By: chandrasekar Fri, 16 Oct 2020 12:24 PM
హైదరాబాద్: తెలంగాణ మాజీ
హోం శాఖ మంత్రి నాయిని నరసింహా రెడ్డి ఆరోగ్యం మరింత క్షీణించింది. జూబ్లీహిల్స్
అపోలో ఆసుపత్రిలో అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో వైద్యులు ఆయనకు
వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఇటీవలే కరోనా బారినపడి కోలుకున్న నర్సింహా రెడ్డికి వారం రోజుల క్రితం జరిపిన
కరోనా పరీక్షల్లో కరోనా నెగటివ్ ఫలితం వచ్చింది.
అంతకంటే ముందుగా
బంజారాహిల్స్లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో ఆయన 16 రోజుల
పాటు చికిత్స తీసుకున్నారు. కుటుంబసభ్యులు
ఆయన త్వరలోనే కోలుకుని ఇంటికి వస్తారని ఆశిస్తున్న తరుణంలోనే ఆయనకు
ఉన్నట్టుండి ఆక్సీజన్ లెవెల్స్ పడిపోయాయి. నాయిని నర్సింహా రెడ్డికి మరోసారి వైద్య
పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకి న్యుమోనియాగా మారిందని నిర్ధారించారు.
దీంతో మరింత మెరుగైన చికిత్స నిమిత్తం ఆయనను హుటాహుటిన జూబ్లీహిల్స్లోని అపోలో
ఆసుపత్రికి తరలించారు.