Advertisement

  • అండ‌మాన్ కు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీని ప్రారంభించిన నరేంద్ర మోడీ

అండ‌మాన్ కు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీని ప్రారంభించిన నరేంద్ర మోడీ

By: chandrasekar Mon, 10 Aug 2020 7:25 PM

అండ‌మాన్ కు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీని ప్రారంభించిన నరేంద్ర మోడీ


ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ప్రతి విషయానికి ఇంటర్నెట్ పై ఆధారపడవలసి ఉంటుంది. ఇందులో భాగంగా చెన్నై మరియు పోర్ట్ బ్లెయిర్ మ‌ధ్య ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ కేబుల్ క‌నెక్టివిటిని ప్ర‌ధాని మోదీ ఇవాళ ఆవిష్క‌రించారు. 2018, డిసెంబ్ 30వ తేదీన‌ పోర్ట్ బ్లెయిర్‌లో ఈ ప్రాజెక్టు కోసం ప్ర‌దాని మోదీ శంకుస్థాప‌న చేశారు. ఈ ప్రాజెక్టుతో అండ‌మాన్ నికోబార్ దీవుల్లో ఈజీ ఆఫ్ లీవింగ్ పెరుగుతుంద‌ని మోదీ తెలిపారు. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీ తో నికోబార్ ప్ర‌జ‌ల‌కు మొబైల్ క‌నెక్టివిటి‌, వేగ‌వంత‌మైన ఇంట‌ర్నెట్ ల‌భిస్తుందన్నారు.

అండ‌మాన్ ప్ర‌జ‌ల‌కు డిజిట‌ల్ ఇండియా లాభాలు అందుతాయ‌న్నారు. టూరిజం, బ్యాంకింగ్‌, షాపింగ్‌, టెలిమెడిసిన్ లాంటి వ‌స‌తులు వేలాది మంది అండ‌మాన్ ప్ర‌జ‌ల‌కు ఆన్‌లైన్ వ్య‌వ‌స్థ అందుబాటులో ఉంటుందన్నారు. ప్రతిదీ డిజిటల్ ట్రాన్సక్షన్స్ మరియు ఇంటర్నెట్ వాడుకలో భాగంగా అతివేగ నెట్వర్క్ కోసం ఈ ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ ఎంతో ఉపయోగపడుతుంది. టూరిస్టుల‌కు ఆప్టిక్ ఫైబ‌ర్ కేబుల్ వ‌ల్ల‌ ఎక్కువ‌గా లాభం టూరిస్టుల‌కు ల‌భిస్తుందని ప్ర‌ధాని మోదీ తెలిపారు.

ఇందువల్ల ఎక్కువగా టూరిస్టులు అండ‌మాన్‌లో స‌మ‌యం గ‌డిపే అవ‌కాశాలు ఉంటాయన్నారు. అనుకున్న స‌మ‌యానికి 2300 కిలోమీటర్ల దూరం స‌ముద్రం లోప‌ల కేబుల్ వేయ‌డం ప్ర‌శంస‌నీయ‌మ‌ని మోదీ తెలిపారు. డీప్ సీ స‌ర్వేలు, కేబుల్ క్వాలిటీ, ప్ర‌త్యేక షిప్‌ల‌తో కేబుల్ వేయ‌డం ప్ర‌శంస‌నీయ‌మ‌న్నారు.

Tags :

Advertisement