జపాన్ ప్రధానీకి శుభాకాంక్షలు తెలిపిన నరేంద్ర మోదీ...
By: chandrasekar Sat, 26 Sept 2020 1:50 PM
జపాన్ ప్రధానిగా
నియమితులైన 'సుగా యోశిహిదే' తన లక్ష్యాల సాధనలో సఫలం కావాలంటూ మోదీ ఆయనకు
శుభాకాంక్షలు చెప్పారు. భారత్, జపాన్ ల మధ్య ఏర్పడ్డ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ
స్ధాయి భాగస్వామ్యం గత కొన్నేళ్ళ లో ఎంతో పురోగమించిందని నేతలిద్దరూ
అంగీకరిస్తూ, పరస్పర విశ్వాసం, ఉమ్మడి విలువల ద్వారా ఈ
భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవాలన్న ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు.
కరోనా మహమ్మారి సహా
ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్ళను దృష్టిలో ఉంచుకొంటే, ఇరు
దేశాల మధ్య ఏర్పడిన భాగస్వామ్యం ప్రస్తుతం మరింత బలంగా ఉందంటూ ఉభయ నేతలు
ఏకీభవించారు. ఆటు పోటులకు తట్టుకొని నిలచే సరఫరా వ్యవస్థ అండదండలతో ఇండో-పసిఫిక్
ప్రాంతంలో అరమరికలకు తావు లేని, స్వేచ్ఛాయుత, సమ్మిళిత
స్వరూపం కలిగిన ఆర్థిక వ్యవస్థ ముందుకుసాగాలని వారు స్పష్టం చేశారు.
కరోనా మహమ్మారి మెరుగుపడ్డ తర్వాత వార్షిక ద్వైపాక్షిక శిఖర
సమ్మేళనం లో పాలుపంచుకోవడానికి భారతదేశానికి రావలసిందిగా ప్రధాని సుగా
యోశిహిదేను మోదీ ఆహ్వానించారు. భారతదేశానికి, జపాన్ కు, భావసారూప్యం కల ఇతర దేశాలకు మధ్య ఇప్పుడు
కొనసాగుతున్న సహకారాన్ని నేతలిద్దరూ స్వాగతించారు.