Advertisement

  • తెలంగాణ బీజేపీ చీఫ్ కు ఫోన్ చేసిన ప్రధాని మోడీ...

తెలంగాణ బీజేపీ చీఫ్ కు ఫోన్ చేసిన ప్రధాని మోడీ...

By: Sankar Wed, 02 Dec 2020 4:25 PM

తెలంగాణ బీజేపీ చీఫ్ కు ఫోన్ చేసిన ప్రధాని మోడీ...


ఇటీవల తెలంగాణాలో బీజేపీ తమ పట్టు పెంచుకునేందుకు తీవ్రంగా కృషి చేసింది ...దుబ్బాకలో విజయంతో తెరాస కి ప్రత్యర్థి పార్టీ గా తెలంగాణాలో బీజేపీ ఎదిగింది...అయితే తాజాగా జిహెచ్ఎంసి ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే...ఈ ఎన్నికల విషయమే ప్రధాని మోడీ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు ఫోన్ చేసారు..

ఈ మేరకు తెలంగాణ బీజేపీ బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. 'తాజాగా జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల స్థితిగతులపై ప్రధాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాదాపు 10 నిమిషాలపాటు, ఎన్నికల సరళిపై పార్టీ పరిస్థితులపై ప్రధాని ముచ్చటించారు. నాయకులు, కార్యకర్తలపైన జరిగిన దౌర్జన్యంపై ప్రధాని వివరాలు అడిగి తెలుసుకున్నారు..

ఈ సందర్భంగా కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారని ప్రధాని మోదీ అభినందించారు. పార్టీని విజయతీరాలకు చేర్చడానికి అన్ని విధాలా పోరాడిన తెలంగాణ శాఖ కార్యకర్తల పోరాట పటిమను మోదీ కొనియాడారు. నూతన ఉత్సాహంతో పార్టీ క్యాడర్‌ నడవడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. దైర్యంగా ముందుకు సాగాలని అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలి' అని ప్రధాని మోదీ సూచించినట్లు తెలంగాణ బీజేపీ ఆ ప్రకటనలో తెలిపింది

Tags :
|

Advertisement