Advertisement

  • టిడిపి జాతీయ కార్యదర్శి లోకేష్ కు తప్పిన ప్రమాదం ..

టిడిపి జాతీయ కార్యదర్శి లోకేష్ కు తప్పిన ప్రమాదం ..

By: Sankar Tue, 27 Oct 2020 06:11 AM

టిడిపి జాతీయ కార్యదర్శి లోకేష్ కు తప్పిన ప్రమాదం ..


టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన సందర్భంగా సోమవారం అపశృతి చోటుచేసుకుంది. ఆకివీడు నుంచి లోకేశ్‌ స్వయంగా ట్రాక్టర్‌ నడుపుతూ వెళుతుండగా.. సిద్ధాపురం వద్ద అదుపు తప్పి పక్కనే ఉన్న చినకాపవరం డ్రెయిన్‌లోకి దూసుకుపోయింది.

స్థానిక ఎమ్మెల్యే మంతెన రామరాజు అప్రమత్తమై ట్రాక్టర్‌ ఇంజిన్‌ ఆపివేయడంతో ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో భద్రతా సిబ్బంది, నేతలు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం సిద్ధాపురంలో లోకేశ్‌ పర్యటించారు. అంతకుముందు ఆకివీడులో విలేకరుల సమావేశంలో లోకేశ్‌ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ వ్యయాన్ని కుదించడం దురదృష్టకరమన్నారు.

రూ.55 వేల కోట్ల అంచనాలతో రూపొందించిన ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం మారిన తరువాత రూ.22 వేల కోట్లకు ఎందుకు కుదించారో అర్థం కావడం లేదన్నారు. ఎంపీలు పోలవరం నిధుల కోసం పోరాడాలని, ట్వీట్లతో కాలం గడపకుండా రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని అన్నారు

Tags :

Advertisement