పొరపాటు చేశా అందుకే చనిపోతున్న ..నంద్యాల డాక్టర్ మాధవీలత రాసిన సూసైడ్ నోట్
By: Sankar Thu, 27 Aug 2020 11:03 AM
కర్నూల్ జిల్లా నంద్యాలలో డెంటిస్ట్ మాధవీలత ఆత్మహత్య కేసులో కీలకంగా భావిస్తున్న సూసైడ్ నోట్లోని విషయాలు బయటికి వచ్చాయి.
కుటుంబం, ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు లేని మాధవీలత ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని ఇన్ని రోజులుగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు ఆమె రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు బయట పెట్టకపోవడంపైనా అనుమానాలు వచ్చాయి. దీనిపై అనేక విమర్శలు రావడంతో పోలీసులు చివరకు ఆమె రాసిన నోట్ను బయటపెట్టారు.
నేను ఒక పొరపాటు చేశాను. నీతో బాధ్యతగా మెలగలేకపోయాను. నీ మీద ప్రేమతోనే ఈ ఆత్మహత్య చేసుకుంటున్నాను. కొడుకును బాగా చూసుకో, నువ్వు మరో పెళ్లి చేసుకో, నేను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నానని ఎవరైనా అడిగితే ఓ వ్యాధితో బాధపడుతున్నాని చెప్పు. నన్ను క్షమించు’ అంటూ భర్తను ఉద్దేశించి మాధవీలత లెటర్ రాశారు. ఈ కేసుపై విచారణ చేస్తున్న టూటౌన్ పోలీసులు ఆమె చేసిన పొరపాటు ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.