వరద బాధితులకు నందమూరి బాలకృష్ణ కోటిన్నర రూపాయలు విరాళం
By: chandrasekar Mon, 19 Oct 2020 10:24 AM
బారి వర్షాలవల్ల
హైదరాబాద్ నగరం నీటిలో మునిగిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ను
వర్షభీభత్సం సృష్టించడం వల్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భాగ్యనగర వీధులన్నీ
చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్ళ మధ్యలోంచి వరదలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్ల
పక్కన నివాసముంటున్న ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. వాళ్ల జీవితాలు నీట మునిగిపోయాయి.
ప్రస్తుతం చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లు మారిపోయింది పరిస్థితి. ఇలాంటి సమయంలో
వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం కూడా తనవంతు సాయం చేస్తుంది. ఈ క్రమంలో
నందమూరి బాలకృష్ణ ముందుకొచ్చాడు. తనవంతుగా హైదరాబాద్ వరద బాధితులకు కోటిన్నర
రూపాయలు విరాళం ప్రకటించాడు.
బారి వర్షాల వల్ల వీధిన
పడ్డ బాధితుల కోసం ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి విరాళం అందించిన తొలి
హీరో ఈయనే కావడం గమనార్హం. దాంతో పాటు ఇటీవల జరిగిన రోడ్డు పక్కనున్న నివాసాలు
పూర్తిగా వర్షపు నీరుతో కొట్టుకుపోయిన వాళ్లకి అండగా నిలిచాడు నందమూరి బాలకృష్ణ.
అదే విధంగా పాతబస్తీలో బసవతారకరామా సేవసమితి ఆధ్వర్యంలో 1000
కుటుంబలకు బిర్యానీ ఏర్పాటు చేసి వాళ్లకు పంపించారు. అంతేకాదు ఇంకా ఏదైనా అవసరం
కావాలన్నా కూడా తాను ముందుంటానని బాలయ్య హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. బాలయ్య
మాత్రమే కాదు ఇండస్ట్రీలో మిగిలిన హీరోలు కూడా ఆర్థిక సాయం చేయడానికి
ముందుకొస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈవిధంగానైనా బాధితులకు కొంత మేలు
జరిగినట్లవుతుంది.