Advertisement

న్యూజెర్సీ లో నల్గొండ జిల్లా వాసి మృతి...!

By: Anji Tue, 29 Dec 2020 12:22 PM

న్యూజెర్సీ లో నల్గొండ జిల్లా వాసి మృతి...!

నల్గొండ జిల్లాలో విషాద ఛాయలు అలుము కున్నాయి. అమెరికాలో ఎన్నారై నల్లమాద దేవేందర్ రెడ్డి అనుమానాస్పద మృతి చెందారు. దేవేందర్ రెడ్డి స్వగ్రామం నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కర్నాటిపల్లి గ్రామానికి చెందిన వాడు.

న్యూజెర్సీ లో ఉద్యోగం చేస్తున్నాడు. అంతే కాకుండా దేవేందర్ రెడ్డి అమెరికాలో టిఆర్ఎస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా కూడా పని చేస్తున్నారు. న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ ప్రాంతంలో దేవేందర్ రెడ్డి తన కారులో మృతిచెంది ఉన్నాడు.

సమాచారం అందుకున్న వెంటనే న్యూజెర్సీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. దేవేందర్ రెడ్డి కుటుంబం సభ్యులకు సమాచారం ఇచ్చారు.

ఇటీవల న్యూజెర్సీలో జరిగిన ప్రమాదంలో హన్మకొండకు చెందిన ప్రవీణ్ దేసిని న్యూజెర్సీలో మరణించారు. ఎడిసన్‌కు సమీపంలోని రైల్వేస్టేషన్ వద్ద రైలు కింద పడి ప్రవీణ్ ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటన డిసెంబర్ 22న చోటు చేసుకుంది. హన్మకొండకు చెందిన ప్రవీణ్ న్యూజెర్సీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఎడిసన్ నుంచి న్యూయార్క్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

Tags :

Advertisement