రవీంద్ర భారతి ముందు కిరొసిన్ పోసుకొని నిప్పంటించుకున్న నాగులు మృతి
By: Sankar Sun, 13 Sept 2020 11:03 AM
తెలంగాణ వచ్చాక తమకు అన్యాయం జరిగిందంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బైకెలి నాగులు చికిత్స పొందుతూ శని వారం మృతి చెందినట్లు సైఫాబాద్ పోలీ సులు తెలిపారు.
ఈ నెల 10న రవీంద్రభారతిరోడ్డులో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న నాగులును సైఫాబాద్ పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలిం చారు. మెరుగైన చికిత్స అందిస్తున్నప్పటికీ 62 శాతం శరీరం కాలిపోవడంతో వైద్యానికి సహకరించక మృతి చెందినట్లు ఉస్మానియా ఆస్పత్రి ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ నాగప్రసాద్ తెలిపారు.
కాగా నాగులు భార్య మాట్లాడుతూ ఎప్పుడూ తెలంగాణ ఉద్యమం అంటూ తిరిగే నా భర్త మంటల్లో కాలుతూ కూడా జై తెలంగాణ అంటూ నినదించిండు. నా భర్త మమ్మల్ని వీడి వెళ్లిపోవడం మా కుటుంబానికి తీరని లోటు. ఆయన భౌతికదేహాన్ని మొదట కీసర అమరవీరులస్థూపం వద్దకు, అక్కడి నుంచి బండ్లగూడకు తరలించి ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తాం. నా భర్త కోరిక మేరకు మా పిల్లలకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి మా కుటుంబానికి అండగా నిలవాలి అని అన్నారు