నాగార్జున, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో మూడో సినిమా ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్లో..?
By: chandrasekar Mon, 12 Oct 2020 3:19 PM
నాగార్జున హీరోగా పూరీ
జగన్నాథ్ దర్శకత్వంలో శివమణి, సూపర్ సినిమాలు వచ్చాయి. శివమణిలో పవర్ఫుల్ పోలీస్
అధికారిగా కనిపించిన నాగార్జున సూపర్లో దొంగ పాత్రలో కనిపించారు. వీరి కాంబినేషన్
లో మూడో సినిమా ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కనుందని ఫిల్మ్నగర్ వర్గాల టాక్. అక్కినేని నాగార్జున ఓవైపు సినిమాలు నిర్మిస్తూనే మారోవైపు
సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4కు
వ్యాఖ్యాతగా సైతం వ్యవహరిస్తూ, ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో నాగార్జున, డేరింగ్
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలిసి పనిచేయ బోతున్నారని వార్తలు వస్తున్నాయి.
వీరి కాంబినేషన్లో మూడో
సినిమా ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కనుందని ఫిల్మ్నగర్ వర్గాల టాక్. అన్నీ
కుదిరితే వచ్చే ఏడాది వీరి ప్రాజెక్టు షురూ అవుతుంది. కాగా, కింగ్
నాగార్జున ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత చందమామ
కథలు సినిమాతో జాతీయ అవార్డు పొందిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మూవీ చేయాల్సి
ఉంది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే పూరీతో నాగార్జున సినిమా తీయబోతున్నారని
తెలుస్తోంది. మరోవైపు విజయ్ దేవరకొండ, అనన్య పాండేలతో ప్యాన్ ఇండియా మూవీ ‘ఫైటర్’ సినిమాతో
పూరీ జగన్నాథ్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.