Advertisement

  • Good News: ఏలూరులో ప్రజల అస్వస్థతకు కారణం తెలిసిపోయింది... కానీ...!

Good News: ఏలూరులో ప్రజల అస్వస్థతకు కారణం తెలిసిపోయింది... కానీ...!

By: Anji Tue, 08 Dec 2020 07:38 AM

Good News: ఏలూరులో ప్రజల అస్వస్థతకు కారణం తెలిసిపోయింది... కానీ...!

ఏలూరులో ప్రజల అస్వస్థతకు కారణం తెలిసిపోయింది అంటున్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు. భారలోహం సీసమే దీనికి కారణమని.. రోగుల రక్త నమూనాల్లో సీసం, నికెల్‌ అనే లోహాల అవశేషాలు ఎక్కువగా ఉన్నట్లు ఢిల్లీ ఎయిమ్స్‌ పరీక్షల్లో తేలిందంటున్నారు.

ఈ పరీక్షల వివరాలను మంగళగిరి ఎయిమ్స్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అందించినట్లు చెప్పారు. స్థానికంగా ఉన్న తాగునీరు, పాల నమూనాలను పంపాలని ఢిల్లీ ఎయిమ్స్‌ నిపుణులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు.

సీసం కారణంగానే న్యూరో టాక్సిక్‌ లక్షణాలు కనిపిస్తాయని.. బ్యాటరీల్లో ఉండే ఈ లోహం తాగునీరు, పాల ద్వారా రోగుల శరీరంలోకి వెళ్లి ఉండొచ్చని వైద్యులు అభిప్రాయపడినట్లు తెలిపారు.

పేషెంట్స్ బ్లడ్ శాంపిల్స్ లో ఎక్కువగా "లెడ్" అనే హెవీ మెటల్, నికెల్ అనే మెటల్ ఎక్కువుగా ఉన్నట్లు ఎయిమ్స్ ఢిల్లీలో పరీక్షల్లో తెలిసిందన్నారు. లెడ్ కారణంగానే న్యూరో టాక్సిక్ లక్షణాలు కనిపిస్తాయంటున్నారు.

"లెడ్" బ్యాటరీస్ లో ఉండే ఈ పదార్ధం తాగు నీటి ద్వారా, పాల ద్వారా పేషెంట్స్ శరీరంలో వెళ్లి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఏ మార్గం ద్వారా వారి శరీరాల్లో ప్రవేశించిందో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ స్థానికంగా తెలుసుకోవాలి అంటున్నారు.

మెటల్స్ ను డిటెక్ట్ చేసే అధునాతన పరికరాలు ఎయిమ్స్ ఢిల్లీలో మాత్రమే ఉన్నాయని.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించాలన్నారు.

Tags :
|

Advertisement