అభిమానుల ప్రేమకి నా కృతజ్ఞతలు: అమితాబ్
By: chandrasekar Sat, 18 July 2020 3:20 PM
అమితాబ్ బచ్చన్ కొద్ది
రోజుల క్రితం కరోనా బారిన పడ్డ విషయం అందరికి తెలిసిందే. అమితాబ్ ప్రస్తుతం నానావతి ఆసుపత్రిలో చికిత్స
పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, సాధారణ వైద్యం అందిస్తున్నామని వైద్యులు
చెబుతున్నారు. అయితే తనని కంటికి రెప్పలా కాపాడుతున్న వైద్యులకి సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేసిన
అమితాబ్, తాజాగా
తన ఆరోగ్యంపై వివరణ ఇచ్చారు.
మా ఆరోగ్యం గురించి వాకబు
చేస్తూ మాపై కురిపిస్తున్న ప్రేమ, ఆశీర్వాదం, ప్రార్ధనలు అన్నీ చూశాను. అమితమైన ప్రేమకి నా కృతజ్ఞతలు.
హాస్పిటల్లో రూల్స్ చాలా కఠినంగా ఉన్నాయి. ఇవి అన్నీ కూడా మా ఆరోగ్యం కోసమే.
ఇంత కన్నా నేను ఏమి చెప్పలేను అంటూ అమితాబ్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
అమితాబ్తో పాటు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, ఆరాధ్య కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.