Advertisement

బిగ్‌బాస్‌ షో నాల్గో సీజన్‌కు ముస్తాబు

By: chandrasekar Wed, 22 July 2020 2:04 PM

బిగ్‌బాస్‌ షో నాల్గో సీజన్‌కు ముస్తాబు


బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-4 ప్రోమోను స్టార్‌ మా సోమవారం విడుదల చేసింది. తొలి మూడు సీజన్లలో ఆకట్టుకున్న బిగ్‌బాస్‌ షో నాల్గో సీజన్‌కు ముస్తాబవుతుంది. ఇందులో ఎవరెవరు పాల్గొంటారో? షో ఎన్ని రోజులు నిర్వహిస్తారో తెలియరాలేదు. ఇప్పటికే కంటెస్టంట్ల లిస్ట్‌ ఫైనల్‌ అయినట్లు సమాచారం.

గత సీజన్‌లో ప్రేక్షకులను మెంప్పించిన టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జుననే హోస్ట్‌గా కొనసాగే అవకాశాలున్నాయి. కాగా, 70 రోజులే షోను నిర్వహించబోతున్నారని సమచారం. ప్రతి సారి జూన్‌, జులైలో ఈ రియాల్టీ షో ప్రారంభం అవుతుండగా, ఈ సారి కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యమైంది. షోలో పాల్గొనేది వీరేనంటూ కొందరి పేర్లు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్ బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ కోసం వస్తున్నాడని తెలిసింది. అలాగే అల్లరి నరేశ్‌, ప్రముఖ సింగర్‌ సునీత, అలాగే ప్రముఖ యాంకర్లు ఝాన్సీ, రష్మీగౌతమ్‌, లాస్య, మరో యాంకర్‌ రవి, జబర్‌దస్త్‌ ఫేం సుడిగాలి సుధీర్‌, యాంకర్‌ కం సింగర్‌ మంగ్లీ, సినీనటుడు నందు, టీవి నటుడు అఖిల్‌ సార్ధక్‌, టాలీవుడ్‌ బ్యూటీలు హంసానందిని, శ్రద్ధాదాస్‌, యామినీ భాస్కర్‌, వైవా హర్ష, బిత్తిరి సత్తి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.

Tags :
|

Advertisement