Advertisement

  • ఆంజనేయస్వామి గుడికి కోటి రూపాయలు విలువ చేసే భూమిని విరాళం ఇచ్చిన ముస్లిం వ్యక్తి

ఆంజనేయస్వామి గుడికి కోటి రూపాయలు విలువ చేసే భూమిని విరాళం ఇచ్చిన ముస్లిం వ్యక్తి

By: Sankar Wed, 09 Dec 2020 12:23 PM

ఆంజనేయస్వామి గుడికి కోటి రూపాయలు విలువ చేసే భూమిని విరాళం ఇచ్చిన ముస్లిం వ్యక్తి


ప్రపంచంలో భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది...ఒక్క భారత దేశంలోనే అన్ని మతాలకు సమానంగా ప్రాధాన్యత లభిస్తుంది...ఒక్క భారత దేశంలోనే హిందూ ముస్లిం భాయి భాయి అనే నినాదం ఉంది...ఆలా హిందూ ముస్లిం ఒక్కరే అని చాటి చెప్పాడు బెంగుళూరు కు చెందిన హెచ్ఎంజీ బాషా...

హోసకెటో హైవే సమీపంలో ఆంజనేయ స్వామి ఆలయ విస్తరణకు కోసం భాషా తన భూమిని ఇచ్చారు. వివరాలు.. కార్గో బిజినెస్ మ్యాన్ అయిన బాషాకు బెంగళూరు రూరల్ జిల్లాలోని వలెగెరపురా అనే గ్రామంలో మూడెకరాల స్థలం ఉంది. హనుమాన్ ఆలయాన్ని విస్తరించాలనుకొని ఆరు నెలల క్రితం దేవాలయ ట్రస్టీలు బాషాను స్థలం కోరారు. అప్పుడే ఆ విషయాన్ని అంగీకరించిన ఆయన.. ప్రస్తుతం తన భూమిలోని కొంత స్థలాన్ని ఆలయానికి ఇచ్చేశారు.

ట్రస్టీలు ఆయనను 1.5 సెంట్లు అడిగితే ఆయన ఏకంగా ఒకటిన్నర గుంటల భూమి విరాళమిచ్చారు. దీని విలువ సుమారు రూ.80లక్షల వరకు ఉంటుంది. దీంతో బాషా విరాళమిచ్చిన విషయాన్ని తెలియజేస్తూ ఆలయం ముందు ఓ ఫ్లెక్సీని పెట్టారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాషాపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..

Tags :
|

Advertisement