Advertisement

మిర్యాలగూడలో ప్రెస్ మీట్ రద్దయింది ..వర్మ

By: Sankar Mon, 21 Dec 2020 9:50 PM

మిర్యాలగూడలో ప్రెస్ మీట్ రద్దయింది ..వర్మ


ఎప్పుడు ఎదో ఒక వివాదంతో న్యూస్ లో నిలిచే వర్మ తాజగా మరొకసారి వార్తల్లో నిలిచాడు...తన తాజా చిత్రం మర్డర్ సినిమా రిలీజ్ కు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ ఉన్న వర్మ ..మిర్యాలగూడలో ప్రెస్ మీట్ పెడతా అని ప్రకటించాడు..

అయితే తాజాగా మ‌ర్డ‌ర్ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ ర‌ద్దయింద‌ని డైరెక్ట‌ర్ రాంగోపాల్ వ‌ర్మ తెలిపాడు. ఈ మేర‌కు వ‌ర్మ ఓ ట్వీట్ చేశాడు. మిర్యాల‌గూడ న‌ట‌రాజ్ థియేట‌ర్ లో ప్రెస్ మీట్ కు అనుమ‌తి రాలేదు. ప్ర‌స్తుతం ప్రెస్ మీట్ ను ర‌ద్దు చేసుకుంటున్నామ‌ని వ‌ర్మ‌ తెలిపారు. త‌ర్వాత త‌ప్ప‌కుండా మిర్యాల‌గూడ‌కు వ‌స్తామ‌ని స్ప‌ష్ట‌త చేశాడు వ‌ర్మ‌.

ఇక మ‌ర్డ‌ర్ సినిమా ఈ 24న విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. మర్డర్‌ సినిమాకు అనుమతి, థియేటర్లలో సినిమా ప్రదర్శనకు రక్షణ కల్పించాల‌ని చిత్ర నిర్మాత నట్టి కుమార్‌ సోమవారం నల్లగొండ జిల్లా ఎప్పీ రంగనాథ్‌ను కలిశారు.

Tags :
|
|

Advertisement