Advertisement

Breaking News: బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు...!

By: Anji Sat, 17 Oct 2020 10:58 AM

Breaking news:  బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు...!

యూపీలోని ఫిరోజాబాద్ లో దయాశంకర్ గుప్తా అనే బీజేపీ నేతను దుండగులు కాల్చి చంపారు. మండల్ ఉపాధ్యక్షుడైన ఈయన గత రాత్రి తన షాపును మూసివేసి ఇంటికి తిరిగివస్తుండగా బైక్ పై వఛ్చిన ముగ్గురు ఆయనపై కాల్పులు జరిపారు.

తీవ్రంగా గాయపడిన గుప్తా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఇది రాజకీయ కక్షేనని గుప్తా కుటుంబ సభ్యులు తెలిపారు. నరేంద్ర తోమర్, దేవేంద్ర తోమర్ అనే వ్యక్తులపై వారు అనుమానం వ్యక్తం చేయగా,, పోలీసులు ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

తన సహచరుడైన వీరేంద్ర తోమర్ కి, గుప్తాకు ఇటీవల తీవ్ర వాగ్వివాదం జరిగినట్టు తెలిసింది. బీజేపీలో వీరేంద్ర తోమర్ చేరికను గుప్తా వ్యతిరేకించాడని, దాంతో వీరేంద్ర.. తన బంధువులైన నరేంద్ర, దేవేంద్ర తోమర్లను ఇతనిపై హత్యా యత్నానికి ప్రేరేపించాడని తెలుస్తోంది. అయితే వారి కాల్పుల్లో గుప్తా మరణించాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :
|

Advertisement