Advertisement

  • కూతుళ్ల పుట్టిన రోజు వేడుకలు జరిపిన ముంబై ఆటగాళ్లు.. ఫోటో వైరల్

కూతుళ్ల పుట్టిన రోజు వేడుకలు జరిపిన ముంబై ఆటగాళ్లు.. ఫోటో వైరల్

By: chandrasekar Mon, 09 Nov 2020 6:37 PM

కూతుళ్ల పుట్టిన రోజు వేడుకలు జరిపిన ముంబై ఆటగాళ్లు.. ఫోటో వైరల్


ఆదరగొట్టే ఆటతీరుతో ముంబై ఇండియన్స్‌ ఆరవసారి ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై మధ్య ఫైనల్ పోరు జరగనుంది. క్వాలిఫయర్‌-1 ఢిల్లీ జట్టు ఓడించిన ముంబై నేరుగా ఫైనల్‌కు చేరింది. ఆ ఫైట్ తర్వాత మూడు రోజుల సమయం ఉండడంతో ముంబై ఆటగాళ్లు కుటుంబసభ్యులతో కలిసి సరాదగా గడిపారు.

ఈ సమయంలోనే రోహిత్‌ కూతురు సమైరా, ధవల్‌ కులకర్ణి కూతురు నితారా, తారే కూతురు రబ్బానీలు పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. వారితో కేక్‌ కట్‌ చేయించి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ చేశారు క్రికెటర్స్. ఈ సందర్భంగా ఆటగాళ్లు తమ కూతుళ్లతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రాన్ని ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

మంగళవారం ముంబై ఇండియన్స్,ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఆదివారం కీలకమైన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో వార్నర్ సేన ఓడిపోయింది. ఢిల్లీ విధించిన 190 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక చేతులెత్తేసింది. దీందో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 172 పరుగులు మాత్రమే చేసింది. శిఖర్‌ ధావన్‌(78; 50 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్స్‌లు), స్టోయినిస్‌(38; 27 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్‌)లతో పాటు హెట్‌మెయిర్‌( 42 నాటౌట్‌; 22 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) బ్యాట్‌ ఝుళిపించడంతో ఢిల్లీ.. హైదరాబాద్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.

అంతకు ముందు జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో ఢిల్లీ చేతులెచ్చిసింది. ముంబై ఇండియన్స్ విశ్వరూపం చూపించింది. ముంబై నిర్ధేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక ఢిల్లీ క్యాపిటల్స్ చతికిలాపడింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 143 పరుగులు మాత్రమే చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. 57 పరుగుల తేడాతో విజయం సాధించింది ముంబై ఇండియన్స్.

Tags :

Advertisement