Advertisement

  • భార్యను వదిలేసి ప్రియురాలితో ఉండటం కోసం కరోనా డ్రామా ఆడిన వ్యక్తి

భార్యను వదిలేసి ప్రియురాలితో ఉండటం కోసం కరోనా డ్రామా ఆడిన వ్యక్తి

By: Sankar Thu, 17 Sept 2020 5:55 PM

భార్యను వదిలేసి ప్రియురాలితో ఉండటం కోసం కరోనా డ్రామా ఆడిన వ్యక్తి


ప్రపంచం మొత్తం కరోనా కారణంగా అల్లాడుతున్నారు .చిన్న పెద్ద , ధనిక పేద అనే తేడా లేకుండా కరోనా అందరి మీద తన ప్రతాపాన్ని చూయిస్తుంది..అయితే అలంటి కరోనా ను కూడా ఒక వ్యక్తి తన లవర్ తో గడపడం కోసం వాడుకున్నాడు ..ఇది తెలిసిన పోలీసులు అతడి తెలివికి అవాక్కయ్యారు..

భార్యను వదిలించుకుని.. ప్రేమించిన అమ్మాయితో జీవితం గడపాలనుకున్నాడు ఓ వ్యక్తి. అనుకోకుండా కరోనా రూపంలో అవకాశం కలిసి వచ్చింది. దాంతో తనకు కరోనా.. త్వరలోనే చనిపోతాను అని భార్యకు అబద్ధం చెప్పి.. ఐడెంటీ మార్చుకుని లవర్‌తో మరో చోట నివాసం ఉంటున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. ముంబైలోని తలోజా ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల వ్యక్తికి వివాహం అయ్యింది. కానీ మరో యువతిని ప్రేమించాడు. భార్యతో బంధాన్ని తెంపుకుని.. లవర్‌తో జీవించాలనుకున్నాడు. దాంతో కొద్ది రోజుల క్రితం భార్యకు కాల్‌ చేసి ‘నాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది.. త్వరలోనే నేను చనిపోతాను’ అని చెప్పి.. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకున్నాడు. ఆందోళనకు గురయిన నిందితుడి భార్య దీని గురించి తన అన్నకు తెలిపింది. కుటుంబ సభ్యులు అతడి కోసం గాలించడం ప్రారంభించారు.

ఇంతలో ఓ రోజు నిందితుడి బైక్‌ వషి ప్రాంతంలో అతడి బంధువుకు కనిపించింది. దాంతో అతడు పోలీసులకు మిస్సింగ్‌ కంప్లైంట్‌ ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలించడం ప్రారంభించారు. పోలీసులు అతడి వ్యక్తిగత విషయాలు కూపీ లాగగా అతడికి మరో స్త్రీతో సంబంధం ఉన్నట్లు తెలిసింది. దాని ఆధారంగా దర్యాపు​ చేయగా నిందితుడు ఇండోర్‌లో ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. దాంతో అతన్ని పోలీసులు పట్టుకుని.. కౌన్సిలింగ్‌ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Tags :
|

Advertisement