MI VS DC : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ ...
By: Sankar Sat, 31 Oct 2020 3:18 PM
ఐపీఎల్ 2020 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో దుబాయ్ వేదికగా శనివారం మధ్యాహ్నం జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఢిల్లీ తుది జట్టులో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మూడు మార్పులు చేశాడు. ఓపెనర్ అజింక్య రహానెపై వేటు వేసి మళ్లీ పృథ్వీ షాని టీమ్లోకి తీసుకోగా.. స్పిన్నర్ అక్షర్ పటేల్కి బదులుగా ప్రవీణ్ దుబే వచ్చాడు. ముంబయి తుది జట్టులోనూ రెండు మార్పులు జరిగాయి. హార్దిక్ పాండ్యా, ప్యాటిన్సన్ స్థానంలో జయంత్ యాదవ్, నాథన్ కౌల్టర్ నైల్ టీమ్లోకి వచ్చారు.
తాజా సీజన్లో 12 మ్యాచ్లాడిన ఢిల్లీ టీమ్ ఏడింట్లో గెలుపొంది.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈరోజు మ్యాచ్లో గెలిస్తే ఢిల్లీ టీమ్ ప్లేఆఫ్లో అడుగుపెట్టనుంది. మరోవైపు 12 మ్యాచ్లాడి ఎనిమిదింట్లో విజయం సాధించిన ముంబయి ఇండియన్స్ ఇప్పటికే ప్లేఆఫ్లోకి ఎంట్రీ ఇచ్చింది. దాంతో.. ఈరోజు మ్యాచ్లో ముంబయి టీమ్ స్వేచ్ఛగా చెలరేగిపోయే అవకాశం ఉంది.
ముంబయి టీమ్లో ఓపెనర్ డికాక్, ఇషాన్ కిషన్ మంచి టచ్లో కనిపిస్తుండగా.. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య ఇటీవల ఫామ్ అందుకున్నారు. ఇక కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఆల్రౌండర్ ప్రదర్శనతో రాణిస్తుండగా.. బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చాహర్ ఆ టీమ్ విజయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.