Advertisement

అలవోక విజయాన్ని అందుకున్న ముంబయి ఇండియన్స్

By: chandrasekar Fri, 02 Oct 2020 02:54 AM

అలవోక విజయాన్ని అందుకున్న ముంబయి ఇండియన్స్


ఐపీఎల్ 2020 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ టీమ్ మళ్లీ గాడిన పడింది. గురువారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టిన ముంబయి ఇండియన్స్ 48 పరుగుల తేడాతో అలవోక విజయాన్ని సాధించింది.

ఈ సీజన్‌లో నాలుగో మ్యాచ్‌ ఆడిన ఇండియన్స్ టీమ్‌కి ఇది రెండో గెలుపుకాగా కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌ మూడుసార్లు ఓటమి పాలైంది. మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (70: 45 బంతుల్లో 8x4, 3x6)తో పాటు హిట్టర్లు కీరన్ పొలార్డ్ (47 నాటౌట్: 20 బంతుల్లో 3x4, 4x6), హార్దిక్ పాండ్య (30 నాటౌట్: 11 బంతుల్లో 3x4, 2x6) చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో కాట్రెల్, మహ్మద్ షమీ, గౌతమ్ తలో వికెట్ పడగొట్టారు.

Tags :
|
|

Advertisement