అలవోక విజయాన్ని అందుకున్న ముంబయి ఇండియన్స్
By: chandrasekar Fri, 02 Oct 2020 02:54 AM
ఐపీఎల్ 2020 సీజన్లో
ముంబయి ఇండియన్స్ టీమ్ మళ్లీ గాడిన పడింది. గురువారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో
అబుదాబిలో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్లోనూ అదరగొట్టిన ముంబయి
ఇండియన్స్ 48 పరుగుల తేడాతో అలవోక విజయాన్ని సాధించింది.
ఈ సీజన్లో నాలుగో మ్యాచ్
ఆడిన ఇండియన్స్ టీమ్కి ఇది రెండో గెలుపుకాగా
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మూడుసార్లు ఓటమి పాలైంది. మ్యాచ్లో కెప్టెన్
రోహిత్ శర్మ (70: 45 బంతుల్లో 8x4,
3x6)తో పాటు హిట్టర్లు కీరన్ పొలార్డ్ (47
నాటౌట్: 20
బంతుల్లో 3x4, 4x6), హార్దిక్ పాండ్య (30 నాటౌట్: 11
బంతుల్లో 3x4, 2x6) చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి
ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. పంజాబ్
బౌలర్లలో కాట్రెల్, మహ్మద్ షమీ, గౌతమ్ తలో వికెట్ పడగొట్టారు.