టాప్ స్థానంపై కన్నేసిన ముంబై ఇండియన్స్ ..నేడు రాజస్థాన్ రాయల్స్ తో డీ
By: Sankar Tue, 06 Oct 2020 4:11 PM
ఐపీఎల్ టోర్నమెంట్ ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.. ఊహించని ఫలితాలు వస్తున్నాయి.. దాదాపు మ్యాచులన్నీ ఉత్కంఠభరితంగానే సాగుతున్నాయి.. మరికాసేపట్లో అబుదాబిలో జరగబోయే ముంబాయి ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ కూడా ఆసక్తికరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఐపీఎల్ టోర్నమెంట్లో ఇప్పటి వరకు 20 సార్లు తలపడితే రెండు జట్లు చెరో పది విజయాలు సాధించాయి..
గత అయిదు మ్యాచ్లను చూస్తే నాలుగింటిలో రాజస్తాన్ రాయల్స్ టీమే గెలిచింది.. ముంబాయి ఇండియన్స్ కేవలం ఒక మ్యాచ్లోనే విజయం సాధించింది.. అలాగని ముంబాయి జట్టును తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే బలమైన జట్లను అది ఓడించింది.. చక్కటి ఆల్రౌండ్ ప్రతిభను కనబరుస్తోంది.. ఇప్పటివరకు ఆడిన అయిదు మ్యాచులలో మూడింటిలో విజయం సాధించింది.. అయిదో కప్ సాధించడం కోసం ఆరాటపడుతోంది. చెన్నైతో జరిగిన మొదటి మ్యాచ్లో ఓటమి పాలైనప్పటికీ మరుసటి మ్యాచ్కే పుంజుకోగలిగింది.
మరోవైపు రాజస్తాన్ రాయల్స్ కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతోంది. ఈ మ్యాచ్కైనా వస్తాడనుకున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ ఇంకా క్వారంటైన్లో ఉండటం రాజస్తాన్కు ఒకింత మైనస్సే! ఇక సీనియర్ బ్యాట్స్మన్ రాబిన్ ఊతప్ప ఫామ్ కోసం అష్టకష్టాలు పడుతున్నాడు.. పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు.. ఈ విషయంలోనూ రాజస్తాన్ కాసింత ఆందోళన చెందుతోంది. ముంబాయితో జరిగే మ్యాచ్ కీలకం కాబట్టి ఊతప్పను డ్రాప్ చేసి అతని స్థానంలో యశస్వీ జైస్వాల్ను ఆడించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. ఎందుకంటే జైస్వాల్ మంచి ఫామ్లో ఉన్నాడు..